'పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి' అన్నారు పెద్దలు. అలా తినే విషయంలో, బుద్ధి విషయంలో ఎవరి ఇష్టం వాళ్లకు ఉంటుంది. ఒక్కొక్కరు స్పైసీ ఫుడ్ ని ఇష్ట పడతారు. మరి కొందరు కారం తక్కువగా తింటారు. ఇంకొందరు పుల్లగా, తియ్యగా ఉండే ఆహారాన్ని ఇష్టపడతారు. ఇతర దేశాల సంగతి పక్కకు పెడితే భారత దేశంలో మాత్రం ఘాటు లేకుండా ఆహారం అస్సలు నోటికి రుచించదు. అయితే కారం తక్కువ తినాలని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయని చెబుతున్నారు.
బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది: ఘాటుగా ఉన్న ఆహారంలో ఉఫ్పు, మసాలాలు ఎక్కువగా ఉంటాయి. దీని కారణంగా రక్త పోటు వస్తుంది. గుండె సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. బీపీ ఉన్నవాళ్లు కారం, మసాలాలు చాలా తగ్గించి తీసుకోవాలి. లేదంటే మాత్రం ప్రమాదంలో పడతారు.
చర్మ సమస్యలు వస్తాయి: మసాలాలు ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల స్కిన్ లో ని తేమ తగ్గిపోతుంది. అలాగే పొడిబారడంతో పాటు చర్మ సమస్యలు వస్తాయి. అందుకే చలి కాలంలో ఈ సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. అందుకే వీలైనంత వరకూ చలి కాలంలో సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి.
బరువు పెరుగుతారు: స్పైసీ ఫుడ్ తినడం వల్ల ఈజీగా బరువు పెరిగే ఛాన్స్ ఉంది. ఇందులో ఎక్కువగా క్యాలరీలు ఉంటాయి. అలాగే స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత ఇంకా ఆకలిగా ఉంటుంది. కాబట్టి బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఫైల్స్ వచ్చే ప్రమాదం ఉంది: ఘాటైన ఆహారం తినడం వల్ల ఫైల్స్ వచ్చే ఛాన్స్ ఉందని వైద్యులు కూడా చెబుతున్నారు. కాబట్టి స్పైసీ ఎక్కువగా ఉండే ఆహారాలను తక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు