
కావాల్సిన పదార్ధాలు : రెండు కట్టలు తోటకూర, నాలుగు పండు టమాటాలు, 100 గ్రాములు పండు మిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, 3 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం, రెండు ఉల్లిపాయలు, కొత్తిమీరను తీసుకోవాలి.

ముందుగా తోటకూరను బాగా శుభ్రం చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని, పండు మిర్చి, పచ్చి మిర్చి కూడా నీటిలో వాష్ చెసి తేమ లేకుండా పలుచటి క్లాత్ తో తుడిచి ఆరబెట్టాలి.

ఆ తర్వాత స్టవ్ వెలిగించి దానిలో ఆయిల్ వేసి తోటకూర ఆకులు, టమాటాలు, పచ్చి మిర్చి, పండు మిర్చి వేసి బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత వీటిని రోటిలో ఒక్కొక్కటిగా వేసి కచ్చా పచ్చగా దంచుకుని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి.

రోటిలో నూరే టప్పుడు ఉప్పు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా నూరుకోవాలి. రుచిని చూసి సరిపడా ఉప్పు వేసి నూరి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గ్రైండ్ చేసేకన్నా రోటిలో నూరితే రుచిగా అదిరిపోతుంది. ఈ టెస్ట్ కోసం మీరు కూడా ఇలాగే ట్రై చేయండి.

తోటకూర రోటి పచ్చడి రెడీ అయిన తర్వాత మూడు స్పూన్స్ నిమ్మరసాన్ని కలుపుకోవాలి. మేము మంట ఉంటే తినలేము అనుకున్న వాళ్లు ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తే రుచిగా ఉంటుంది. అంతే వేడి వేడి తోటకూర రోటి పచ్చడి రెడీ. ఇలా చేస్తే ఒక ప్లేట్ తినే వాళ్లు రెండు ప్లేట్లు లాగిస్తారు.