నిన్న రాత్రి చేసిన బిర్యానీని చాలా మంది ఇష్టంగా తింటారు. కానీ ముందు రోజు స్పైసీ బిర్యానీ తినడం వల్ల కడుపు నొప్పి వస్తుంది. ఇలా ఎక్కువ సేపు నిల్వ వుంచిన స్పైసీ ఫుడ్ కడుపును ఇబ్బంది పెడుతుంది.
లంచ్లో శాండ్విచ్, ఇతర ఫ్రైలు, ప్యాక్ చేసిన ఆహారాన్ని తినడం వల్ల ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతుంది. కడుపు ఉబ్బరం, మంట వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ఏదైనా పండ్లను భోజనం చేసిన వెంటనే లేదా భోజనానికి ముందు తినకూడదు, ఎందుకంటే ఇది జీర్ణక్రియకు భంగం కలిగిస్తుంది. దాంతో అజీర్ణ సమస్యలు వంటివి తలెత్తుతాయి.
మధ్యాహ్న సమయంలో ఎక్కువ ఆకలితో ఉన్నందున ప్రజలు ఎక్కువ ఆహారం తినాలని కోరుకుంటారు. అలాంటప్పుడు వేయించిన ఆహారాన్ని మానుకోండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినండి.
స్మూతి, రసం, షేక్స్ వంటివి లిక్విడ్ డైట్ మీ కడుపుని కొంచెం వేగంగా నింపుతుంది. అయితే ఇది మీ శరీరానికి మధ్యాహ్న భోజనానికి అవసరమైన ముఖ్యమైన ఆహారం కాదు.
చిన్న పిజ్జా ముక్క తింటే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. కానీ దీని వల్ల శరీరానికి కావల్సిన పోషణ అందదు. ప్రతి మధ్యాహ్నం సరైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినండి.