
కీళ్ల నుండి వచ్చే శబ్దాలు, కండరాల పట్టేయడం వంటివి సాధారణంగా గ్యాస్ట్రిక్ సమస్యల వల్లే వస్తాయట. మనం తినే ఆహారంలో కొంత భాగం జీర్ణం కాకపోవడం వల్ల శరీరంలో "వాతం" లేదా గ్యాస్ పేరుకుపోతుందని, ఇది కండరాలు, కీళ్లలో బిగుతుగా మారి, నొప్పిని కలిగేలా చేస్తాయట. ఈ వాతం బయటకు వెళ్ళినప్పుడు కీళ్లలో శబ్దాలు వస్తాయని, ఇది జీర్ణక్రియ సరిగా లేదనే దానికి సంకేతమని వైద్యులు చెప్తున్నారు.

ఆధునిక వైద్య విధానాలు తరచుగా విటమిన్ డి, బి12 లోపాలు వంటి సమస్యలకు సప్లిమెంట్లను సూచిస్తాయని, అయితే ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమే. మూలకారణమైన జీర్ణవ్యవస్థను సరిదిద్దకపోతే సమస్య మళ్లీ వస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచుకోవడానికి మొదట ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే అవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడతాయి. కేవలం ఉడకబెట్టిన కూరగాయలను మాత్రమే తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థకు విశ్రాంతిని ఇవ్వవచ్చు.

ఉదయం పూట భారీ ఆహారం తీసుకోవచ్చు. మధ్యాహ్నం సులభంగా జీర్ణమయ్యే కూరగాయలు తినాలి. రాత్రిపూట ఘనమైన ఆహారాన్ని పూర్తిగా మానేసి, కూరగాయల సూప్లు, పండ్ల రసాలు వంటి ద్రవ పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. రాత్రి పూట ఫైబర్ అధికంగా ఉండే ఘన పదార్థాలు జీర్ణం కావడం కష్టం కాబట్టి, పల్ప్ తీసివేసిన సూప్లు, రసాలు ఉత్తమమని తెలుపుతున్నారు నిపుణులు.

300 గ్రాముల చిక్కుడుకాయలో అత్యధిక ప్రొటీన్, ఫైబర్ ఉంటాయని, ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, ఎముకల సాంద్రతను పెంచుతుందని, కిడ్నీ సమస్యలను కూడా తగ్గిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. ఇది ఔషధంలా పనిచేస్తుందని ఆయన తెలిపారు.

మంచి జీర్ణవ్యవస్థతో, శరీరానికి అవసరమైన విటమిన్లు, ప్రొటీన్లు, కాల్షియం అన్నీ సమృద్ధిగా అంది, ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. విటమిన్ డి, బి12 వంటి లోపాలు రాకుండా నిరోధించబడతాయి. సరైన అవగాహనతో ఎలాంటి మందులు వాడకుండానే ఆరోగ్యంగా ఉండవచ్చు.