
దేశంలో ఒకేసారి రెండు తుఫాన్లు దూసుకొస్తున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన తేజ్ తుఫాన్, మరోవైపు బంగాళాఖాతంలో హమూన్ తుఫాన్ ఏర్పడినట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది.

తేజ్ తుపాన్ అక్టోబరు 22న తీవ్ర తుఫానుగా మారి యెమెన్-ఒమన్ తీరాల వైపు పయనిస్తున్నట్లు ఐఎండీ తెలిపింది. ఈ తుఫాన్ వాయువ్య దిశగా కదిలి, ఆల్గైదా, సలాలా మధ్య తీరం దాటుతుందని అంచనా వేసింది.

వీస్తాయని తెలిపింది. తీరరేఖకు ఇరువైపులా ఒకేసారి రెండు తుఫానులు సంభవించడం చాలా అరుదని వాతావరణ నిపుణులు తెలిపారు. 2018లో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్నారు.

హమూన్ తుఫాను బంగ్లాదేశ్ తీరం దిశగా కదులుతోందని వెల్లడించింది. మరి కొన్ని గంటల్లో ఇది తీరం దాటే అవకాశం ఉందని, కేరళ, తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. సముద్రం అల్లకల్లోలంగా ఉందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇక ఈశాన్య రుతుపవనాల ఆగమనాన్ని ఖరారు చేస్తూ తమిళనాడులో అక్టోబరు 21 నుంచే వర్షాలు ప్రారంభమయ్యాయని ఐఎండీ తెలిపింది. తెలంగాణలోనూ రెండు రోజుల్లో ఈశాన్య రుతుపవనాలు ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేసింది.