మహిళల ప్రీమియర్ లీగ్ రెండో ఎడిషన్ ఈరోజు ప్రారంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ప్రారంభ మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తుండగా, తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి.
ఈ మ్యాచ్కు ముందు ఓపెనింగ్ వేడుక జరగనుంది. ప్రముఖ బాలీవుడ్ తారలు ప్రదర్శన ఇవ్వనున్నారు. దీంతో డబ్ల్యూపీఎల్కు శుభారంభం ఇవ్వాలని భావిస్తున్న బీసీసీఐ.. ప్రారంభ మ్యాచ్ చూసేందుకు వచ్చే మహిళలకు బంపర్ గిఫ్ట్ ఇచ్చింది.
దీని ప్రకారం, ముంబై ఇండియన్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగే మొదటి మ్యాచ్ను చూసే మొదటి 500 మంది మహిళా అభిమానులకు ఉచిత టిక్కెట్లు ఇస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని WPL అధికారిక సోషల్ మీడియా ఖాతాలో బీసీసీఐ తెలియజేసింది.
ప్రముఖ బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, వరుణ్ ధావన్, కార్తీక్ ఆర్యన్, సిద్ధార్థ్ మల్హోత్రా తదితరులు ఈరోజు ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొననున్నారు. సాయంత్రం 6:30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది.
స్టార్లు కాకుండా ఐదు జట్ల కెప్టెన్లు మైదానంలో ఉంటారు. హర్మన్ ప్రీత్ కౌర్, లానింగ్లతో పాటు, అమేలియా కెర్, మరిజాన్నె కాప్, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్జ్, నాట్ సివర్ బ్రంట్ ఫీల్డ్లో కనిపించనున్నారు.
ముంబై ఇండియన్స్ మహిళల జట్టు: హేలీ మాథ్యూస్, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), నాట్ సివర్-బ్రంట్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమేలియా కెర్, అమంజోత్ కౌర్, పూజా వస్త్రాకర్, షబ్నిమ్ ఇస్మాయిల్, జింటిమణి కలితా, అమన్దీప్ కౌర్, సైకా ఇషాక్, హుమైరా కాజీ, ఇస్సీ వాంగ్, ప్రియాంక బాల, ఎస్ సజన, కీర్తన బాలకృష్ణన్, ఫాతిమా జాఫర్.
ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టు: షఫాలీ వర్మ, మెగ్ లానింగ్ (కెప్టెన్), జెమీమా రోడ్రిగ్జ్, మరిజానే కప్, అలిస్ క్యాప్సే, అన్నాబెల్ సదర్లాండ్, శిఖా పాండే, తానియా భాటియా (వికెట్ కీపర్), రాధా యాదవ్, పూనమ్ యాదవ్, టైటాస్ సాధు, మిన్ను మణి, జెస్ లారా హారిస్, అరుంధతి రెడ్డి, అశ్వని కుమారి, అపర్ణ మోండల్, స్నేహ దీప్తి.