
స్మృతి మంధాన కెప్టెన్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి మహిళల ప్రీమియర్ లీగ్ 2024 టైటిల్ను గెలుచుకుంది. ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలిచిన తర్వాత స్మృతి మంధాన తన ప్రియుడితో కలిసి కనిపించింది. వీళ్ల ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. స్మృతి మంధాన తన బాయ్ఫ్రెండ్ పలాష్ ముచ్చల్తో కలిసి WPL ట్రోఫీని పట్టుకుని ఫొటో దిగింది.

స్మృతి మంధాన ప్రియుడు పలాష్ ముచ్చల్ కూడా ఓ సెలబ్రిటీనే. ఆయనకు సొంతంగా అభిమానుల ఫాలోయింగ్ ఉంది. కోట్లలో డబ్బు సంపాదిస్తాడు. ముఖ్యంగా, స్మృతి మంధాన తన ప్రియుడు పలాష్ ముచ్చల్ కంటే ఎక్కువ సంపాదిస్తుంది.

ఒక నివేదిక ప్రకారం, WPL అత్యంత ఖరీదైన క్రీడాకారిణి, టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన మొత్తం నికర విలువ రూ. 33.29 కోట్లుగా తేలింది. అయితే, మంధాన ప్రియుడు, గాయకుడు-దర్శకుడు పలాష్ ముచ్చల్ నికర విలువ రూ. రూ. 20 నుంచి రూ.30 కోట్లు అని చెబుతున్నారు.

తొలి ట్రోఫీతో పాటు ఆర్సీబీకి భారీ బహుమతి కూడా లభించింది. WPL గెలిచినందుకు RCBకి 6 కోట్ల రూపాయల బహుమతి వచ్చింది. టైటిల్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 3 కోట్ల బహుమతిని గెలుచుకుంది. ఢిల్లీ వరుసగా రెండో సీజన్కు రన్నరప్ ట్రోఫీని కైవసం చేసుకున్నాడు.