
క్రికెట్ ప్రపంచంలో అత్యంత ఫిట్గా ఉన్న ఆటగాళ్ల గురించి మాట్లాడితే, విరాట్ కోహ్లీ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటాడు. ప్రపంచవ్యాప్తంగా తన ఫిట్నెస్కు పేరుగాంచిన కోహ్లీ, గాయం కారణంగా టీమ్ ఇండియాకు అరుదుగా దూరమవుతాడు. కానీ, గురువారం ఇంగ్లాండ్తో జరిగిన నాగ్పూర్ వన్డేలో, మోకాలి నొప్పి కారణంగా కోహ్లీని ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించారు.

దీంతో 1130 రోజుల తర్వాత గాయం కారణంగా కోహ్లీ జట్టును వీడాల్సి వచ్చింది. నిజానికి, కోహ్లీ గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉండటం ఇదే మొదటిసారి కాదు. దీనికి ముందు, కోహ్లీ గాయం కారణంగా తన కెరీర్లో 5 సార్లు అంతర్జాతీయ మ్యాచ్లు ఆడలేకపోయాడు.

నాగ్పూర్ వన్డేకు 1130 రోజుల ముందు విరాట్ కోహ్లీ గాయం కారణంగా మ్యాచ్కు దూరమయ్యాడు. 2022 దక్షిణాఫ్రికా పర్యటనలో వెన్నునొప్పికి గురైన కోహ్లీ, ఇరు జట్ల మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్కు దూరమయ్యాడు. కోహ్లీ దూరమైన సమయంలో వైస్-కెప్టెన్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్కు తొలిసారి కెప్టెన్గా వ్యవహరించాడు.

అదే సంవత్సరం, అంటే జులై 2022లో, భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్ జరిగింది. ఆ సిరీస్కు ముందు గాయం కారణంగా విరాట్ కోహ్లీ తొలి మ్యాచ్కు దూరమయ్యాడు. కానీ, ఆ మ్యాచ్లో భారత్ 10 వికెట్ల తేడాతో గెలిచింది.

2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్కు కూడా గాయం కారణంగా విరాట్ కోహ్లీ దూరంగా ఉండాల్సి వచ్చింది. నిజానికి, 3 మ్యాచ్ల T20 సిరీస్ 1-1తో సమమైంది. కానీ మూడో మ్యాచ్ కు ముందు కోహ్లీకి వెన్నునొప్పి వచ్చింది. దీంతో కోహ్లీ జట్టును వీడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ జట్టుకు నాయకత్వం వహించాడు. మ్యాచ్ను 7 పరుగుల తేడాతో గెలవడమే కాకుండా సిరీస్ను కూడా కైవసం చేసుకున్నాడు.

2017లో ఆస్ట్రేలియా జట్టు భారతదేశంలో పర్యటించింది. ఈ సిరీస్లో మూడో టెస్ట్ మ్యాచ్ రాంచీలో జరిగింది. ఈ మ్యాచ్లో, బౌండరీని నిరోధించే ప్రయత్నంలో విరాట్ కోహ్లీ భుజానికి గాయమైంది. ఆ తరువాత, ధర్మశాలలో జరిగిన టెస్ట్ మ్యాచ్కు ముందు అతను కోలుకోలేకపోయాడు. అందువలన కోహ్లీ జట్టును విడిచిపెట్టవలసి వచ్చింది.