భారత జట్టు న్యూజెర్సీ: భారత జట్టు ఇకపై ధరించనున్న కొత్త జెర్సీ విడుదలైంది. ఈ మేరకు అడిడాస్ స్పాన్సర్ చేసిన కొత్త జెర్సీలో భారత ఆటగాళ్లు ఫోటోషూట్ చేశారు.
ఈ ఫోటో షూట్లో మెన్స్ టీమ్ నుంచి విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ సిరాజ్ పాల్గొన్నారు.
అలాగే మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన కూడా కొత్త జెర్సీలో మెరిశారు.
టీమిండియా వన్డే క్రికెట్ కొత్త జెర్సీకి సరిగ్గా ఛాతిపై నీలి రంగులో భారత్ అని రాసి ఉంటుంది. ఆ అక్షరాలకు పైన ఒక వైపు అడిడాస్ కంపెనీ లోగో, మరోవపైపు బీసీసీఐ లోగో ఉంటుంది. ఇంకా జెర్సీ భుజాలపై కూడా అడిడాస్ని సూచించేలా స్ట్రిప్స్ ఉన్నాయి.
వన్డే క్రికెట్ జెర్సీలాగానే టీ20 క్రికెట్ జెర్సీ కూడా ఉంది. అయితే ముందటి జెర్సీకి కాలర్ ఉంది కానీ టీ20 క్రికెట్లో టీమిండియా ధరించనున్న జెర్సీకి కాలర్ లేదు. ముదురు నీలం రంగులో ఈ జెర్సీని ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
అయితే వన్డే క్రికెట్లో భారత జట్టు లేత నీలం రంగు జెర్సీని ధరించనుంది. ఇంకా ఈ జెర్సీపై కూడా ఆకర్షణీయమైన డిజైన్ ఉంది.
ఇంతకుముందు MPL కంపెనీ భారత జట్టుకు కిట్ స్పాన్సర్గా ఉంది. కానీ ఇటీవలే MPL స్పాన్సర్షిప్ గడువు ముగిసిపోవడంతో అడిడాస్ స్పాన్సర్షిప్ బాధ్యతలు తీసుకుంది. జూన్ 1 నుంచి టీమ్ ఇండియా కిట్ స్పాన్సర్గా అడిడాస్ కంపెనీ కొత్త అడుగు వేసింది.
ఇందులో భాగంగా మూడు ఫార్మాట్ల క్రికెట్కు సంబంధించి విభిన్నమైన కొత్త జెర్సీలను రూపొందించారు. అయితే వన్డే ప్రపంచకప్ కోసం భారత వన్డే జట్టు జెర్సీ మారనుంది.
ప్రస్తుతం టీమ్ ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్కు సిద్ధమైంది. ఓవల్ మైదానంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు టెస్ట్ ఛాంపియన్గా నిలుస్తుంది. అంటే 2013 తర్వాత తొలి ఐసీసీ ట్రోఫీని గెలుచుకునేందుకు టీమ్ ఇండియాకు ఇది మంచి అవకాశం ఉంది.
కొత్త జెర్సీలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
వన్డే, టెస్ట్ జెర్సీలలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ