
విచారణ సందర్భంగా డబ్బు కోసమే తనను పెళ్లి చేసుకుని, నిత్యం మానసికంగా వేధిస్తోందంటూ ధావన్ తన భార్యపై చేసిన ఆరోపణలు నిజమేనని న్యాయమూర్తి హరీశ్ కుమార్ విశ్వసించరు. ఇంకా చెప్పాలంటే తన భర్త ధావన్ చేసిన ఆరోపణలు అబద్ధమని నిరూపించుకోవడంలో లేదా తన వాదన వినిపించడంలో అయేషా విఫలం అయ్యారు. భర్త చేసిన ఆరోపణలు కనీసం ఆమె ఖండించలేదు. తనని తాను రక్షించుకోవడంలో విఫలం అయింది. దీంతో మూడేళ్లుగా విడిగా ఉంటున్న ఈ దంపతులకు గ్రౌండ్ ఆఫ్ క్రూయెల్టీ కింద విడాకులు మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది.

భార్య మానసిక పరిస్థితి నేపథ్యంలో కొడుకు జోరావర్ శాశ్వత కస్టడీని తనకే అప్పగించాలంటూ ధావన్ చేసిన విజ్ఞప్తిని కోర్టు నిరాకరించింది. ఆ బాలుడు ఆస్ట్రేలియా పౌరుడు కావడంతో కస్టడీ కోసం అక్కడి న్యాయస్థానాలను ఆశ్రయించాలని సూచించింది.

కొడుకును భారత దేశంలో లేదా ఆస్ట్రేలియా లో కలుసుకునేందుకు ధావన్ ను అభ్యంతరం పెట్టవద్దని, తగిన వ్యవధిలో లేదా.. స్కూలు సెలవు దినాలలో సగం రోజులు తండ్రితో గడిపేందుకు బాలుడికి అవకాశం కల్పించాలని ధావన్ భార్యను ఆదేశించింది. అంతేకాదు ధావన్ తన కొడుకుతో వీడియో కాల్ ద్వారా చాట్ చేయడానికి కూడా అనుమతినిచ్చారు.

వివాహం అనంతరం ఆస్తులను తన పేరు మీదికి మార్చాలని ఆయేషా వేధించడం మొదలు పెట్టిందని శిఖర్ ధావన్ 2020లో కోర్టు కెక్కారు. తన కష్టార్జితంతో ఆస్ట్రేలియాలో కొనుగోలు చేసిన మూడు ఆస్తుల విషయంలో తనను వేధించి ఒక ఆస్తిని సొంతం చేసుకుందని ఆరోపించారు.

మిగతా రెండు ఆస్తులు తమ ఇద్దరి పేరు మీద ఉన్నాయని వివరించారు. మిగతా రెండు ఆస్తులను కూడా సొంతం చేసుకోవాలని తరచూ గొడవపడేదని పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై సుదీర్ఘంగా విచారణ జరిపిన ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు, అక్టోబరు 4న ధావన్ కు విడాకులు మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది.

8 ఏళ్ల వయసులోనే పశ్చిమ బెంగాల్కి చెందిన అయేషా ఆస్ట్రేలియా కు చేరుకుంది. ఆమె కిక్ బాక్సర్ కూడా. శిఖర్ ధావన్ కంటే ముందు అయేషా ఓ వ్యాపారవేత్తనుపెళ్లి చేసుకుంది. ఇద్దరు కుమార్తెలు కూడా.. కొన్నాళ్లకే అయేషా విడాకులు తీసుకుంది. ఇద్దరు పిల్లల తల్లి అయేషాకు శిఖర్ ధావన్ కు ఓ స్నేహితురాలి ద్వారా పరిచయం అయింది.

తనకంటే 10 ఏళ్లు పెద్దదైన అయేషాను శిఖర్ ధావన్ పిల్లల్తో సహా అంగీకరించాడు. 2012 అక్టోబర్ లో పెళ్లి చేసుకున్నారు. అయేషా శిఖర్ కు 2014లో జోరావర్ పుట్టాడు.

తర్వాత శిఖర్ ఎంత డబ్బులు ఇచ్చినా సరే డబ్బులు డబ్బులు అంటూ వేధిస్తోందని కొన్నేళ్ల నుంచి విడిగా ఉంటున్నారు. తాజాగా ధావన్ శిఖర్ లకు కోర్టు విడాకులు మంజూరు చేసింది.