Shardul Thakur: ప్రియురాలితో శార్దూల్‌ ఠాకూర్‌ నిశ్చితార్థం.. వైరలవుతోన్న ఫొటోలు..

|

Dec 01, 2021 | 12:29 PM

టీమిండియా పేస్‌ బౌలర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ తన బ్యాచిలర్‌ లైఫ్‌కి బై బై చెప్పేసే సమయం ఆసన్నమైంది. క్రికెట్‌లో ప్రత్యర్థి బ్యాటర్లను బౌల్డ్‌ చేసేఈ యంగ్‌ బౌలర్‌ తన ప్రేయసి మిథాలీ పారుల్కర్‌ అందానికి క్లీన్‌ బౌల్డయ్యాడు. త్వరలోనే ఆమెతో కలిసి పెళ్లిపీటలెక్కనున్నారు. ఇరు కుటుంబీకులు, సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఉంగరాలు మార్చుకున్నారు.

1 / 4
మిథాలీ- శార్దూల్‌లు గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. కుటుంబ పెద్దల ఆశీర్వాదం కూడా లభించడంతో  త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారు.

మిథాలీ- శార్దూల్‌లు గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. కుటుంబ పెద్దల ఆశీర్వాదం కూడా లభించడంతో త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారు.

2 / 4
  ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌కు సంబంధించిన ఓ వేదికపై శార్దూల్‌ ఠాకూర్‌- మిథాలీల ఎంగేజ్‌మెంట్‌ వేడుక జరిగింది.

ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌కు సంబంధించిన ఓ వేదికపై శార్దూల్‌ ఠాకూర్‌- మిథాలీల ఎంగేజ్‌మెంట్‌ వేడుక జరిగింది.

3 / 4
టీమిండియా టీ -20 కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ వేడుకకు హాజరై కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలిపాడు.

టీమిండియా టీ -20 కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ వేడుకకు హాజరై కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలిపాడు.

4 / 4
సహచర క్రికెటర్లు కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, సురేష్ రైనా, విజయ్ శంకర్, వసీం జాఫర్‌ తదితర క్రికెటర్లు సోషల్‌ మీడియా వేదికగా కొత్త జంటకు విషెస్‌ తెలిపారు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ-20 ప్రపంచకప్‌ ముగిసిన తర్వాతే వీరు ఏడడుగులు నడవనున్నారని సమాచారం.

సహచర క్రికెటర్లు కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, సురేష్ రైనా, విజయ్ శంకర్, వసీం జాఫర్‌ తదితర క్రికెటర్లు సోషల్‌ మీడియా వేదికగా కొత్త జంటకు విషెస్‌ తెలిపారు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ-20 ప్రపంచకప్‌ ముగిసిన తర్వాతే వీరు ఏడడుగులు నడవనున్నారని సమాచారం.