
సంజు శాంసన్ అభిమానులకు శుభవార్త రాబోతోంది. సంజు త్వరలో టీమ్ ఇండియాకు తిరిగి రావచ్చని తెలుస్తోంది. వచ్చే నెలలో ప్రారంభమయ్యే వెస్టిండీస్ టూర్లో సంజూ శాంసన్కు అవకాశం లభించవచ్చు.

మీడియా కథనాల ప్రకారం, వెస్టిండీస్తో జరిగే వన్డే, టీ20 సిరీస్లకు సంజూ శాంసన్ను జట్టులో ఎంపిక చేయవచ్చు. గత ఏడాది నవంబర్లో టీమిండియా తరపున సంజూ శాంసన్ చివరి వన్డే ఆడిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో టీ20 మ్యాచ్ కూడా ఆడాడు.

సంజూ శాంసన్ ఇప్పటి వరకు టీమిండియా తరుపున 11 వన్డేల్లో 330 పరుగులు చేశాడు. శాంసన్ సగటు 66 కంటే ఎక్కువగా ఉంది. అలాగే సంజు స్ట్రైక్ రేట్ 104 కంటే ఎక్కువగా ఉంది.

సంజూ శాంసన్తో పాటు ఇషాన్ కిషన్ కూడా వన్డే, టీ20 జట్టులో చోటు దక్కించుకోనున్నాడు. దీంతో పాటు టెస్టు సిరీస్కు బ్యాకప్ వికెట్ కీపర్గా కూడా ఎంపికయ్యే అవకాశం ఉంది. వెస్టిండీస్లో శ్రీకర్ భారత్ ఆడిన సంగతి తెలిసిందే.

ముఖ్యంగా వెస్టిండీస్ వన్డే సిరీస్ సంజూ శాంసన్కు చాలా కీలకమైనదిగా పేర్కొంటున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం ప్రపంచ కప్ కూడా జరగనుంది. సంజు బాగా రాణిస్తే ప్రపంచ కప్ జట్టులో అవకాశం పొందవచ్చని భావిస్తున్నారు.