
Rishabh Pant WTC Record: కొలంబోలో భారత్, శ్రీలంక మధ్య జరుగుతోన్న రెండో టెస్టులో భారత్ తమ తొలి ఇన్నింగ్స్ను 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఈక్రమంలో భారత జట్టు తరపున రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి. ఈ రెండు హాఫ్ సెంచరీల్లో రిషబ్ పంత్ పేరిట ఒకటి ఉంది. ఈ హాఫ్ సెంచరీతో పంత్, కెప్టెన్ గిల్ రికార్డును బద్దలు కొట్టడం విశేషం.

63 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన రిషబ్ పంత్, డబ్ల్యూటీసీలో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా నిలిచాడు. పంత్కు ముందు ఈ జాబితాలో కెప్టెన్ శుభ్మన్ గిల్ ఉండేవాడు. ఇప్పుడు పంత్ గిల్ను వెనక్కి నెట్టి ముందుకు దూసుకెళ్లాడు.

డబ్ల్యూటీసీలో ఇప్పటివరకు పంత్, గిల్ ఇద్దరూ చెరో 42 మ్యాచ్లు ఆడారు. అయితే, గిల్ కంటే పంత్ రెండు ఇన్నింగ్స్లు తక్కువ ఆడినా, అతని కంటే ఎక్కువ పరుగులు సాధించడం గమనార్హం. గిల్ 76 ఇన్నింగ్స్లలో 2,917 పరుగులు చేయగా, మరోవైపు పంత్ 74 ఇన్నింగ్స్లలో 2,948 పరుగులు చేసి గిల్ను అధిగమించాడు.

డబ్ల్యూటీసీలో పంత్, గిల్ తర్వాత రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీలు అత్యధిక పరుగులు చేసిన లిస్ట్లో ఉన్నారు. రోహిత్ 2,716 పరుగులు, జడేజా 2,675 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 2,617 పరుగులు సాధించారు.

రోహిత్, విరాట్ ఇప్పుడు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన సంగతి తెలిసిందే. రోహిత్ను అధిగమించే అవకాశం జడేజాకు ఉంది. ఇదిలా ఉండగా, పంత్, గిల్ల మధ్య డబ్ల్యూటీసీ పరుగుల పోరు ఆసక్తికరంగా మారింది. పంత్ ఖచ్చితంగా ఆధిక్యంలో ఉన్నప్పటికీ, ఒక భారీ ఇన్నింగ్స్తో పంత్ను మళ్లీ అధిగమించే అవకాశం గిల్కు ఉంది.