- Telugu News Photo Gallery Cricket photos RCB Batter Rajat Patidar May Not Play In Final Test Against England, Says Reports
6 ఇన్నింగ్స్ల్లో 63 పరుగులు.. కట్ చేస్తే.. నెక్స్ట్ మ్యాచ్లో విరాట్ ఫ్రెండ్కు టీమిండియా గుడ్బై.. ఎవరంటే?
రాంచీ టెస్టులో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఇంగ్లాండ్పై 5 వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా.. 3-1తో 5 టెస్టు మ్యాచ్ల సిరీస్ను ఒక్క మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. సీనియర్ల గైర్హాజరీలో జూనియర్లు తమపై భారాన్ని వేసుకుని.. భారత్కు అపూర్వ విజయాన్ని అందించారు. జైస్వాల్, గిల్, ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్ లాంటి కుర్రాళ్లు అద్భుతంగా ఆడితే..
Updated on: Feb 27, 2024 | 11:09 AM

రాంచీ టెస్టులో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఇంగ్లాండ్పై 5 వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా.. 3-1తో 5 టెస్టు మ్యాచ్ల సిరీస్ను ఒక్క మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. సీనియర్ల గైర్హాజరీలో జూనియర్లు తమపై భారాన్ని వేసుకుని.. భారత్కు అపూర్వ విజయాన్ని అందించారు. జైస్వాల్, గిల్, ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్ లాంటి కుర్రాళ్లు అద్భుతంగా ఆడితే.. గత మూడు టెస్టులకు మిడిలార్డర్లో అవకాశం దక్కించుకున్న రజత్ పటిదార్ మాత్రం మరోసారి తన పేలవ ఫామ్ కొనసాగించాడు. నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో కూడా గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు. అతడి ఆటతీరు చూస్తుంటే.. ఐదో టెస్టుకు ఛాన్స్ దొరకడం కష్టంగా కనిపిస్తోంది.

రాజ్కోట్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో 5 పరుగులు చేసిన రజత్ పటిదార్.. రెండో ఇన్నింగ్స్లో ఖాతా తెరవలేకపోయాడు. వైజాగ్ మ్యాచ్లో 32, 9 పరుగుల ఇన్నింగ్స్లు ఆడాడు. ఇలా 6 ఇన్నింగ్స్లలో కేవలం 63 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఐదో టెస్టుకు అతడి స్థానంలో బెంచ్పై ఎదురుచూస్తోన్న దేవదూత్ పడిక్కల్కు టీం మేనేజ్మెంట్ అవకాశం ఇవ్వొచ్చునని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో నాలుగు వేలకు పైగా పరుగులు చేసిన రజత్ పటిదార్. దాదాపుగా 12 సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే ఈ సిరీస్కు జట్టులోకి ఎంపిక కాకముందు, రంజీ ట్రోఫీలో వరుసగా రెండు సెంచరీలు బాదేశాడు.

తొలి టెస్టు తర్వాత మిడిలార్డర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ గాయం కారణంగా తప్పుకోవడంతో రజత్ పటిదార్కు అవకాశం వచ్చింది. వైజాగ్, రాజ్కోట్ టెస్టుల్లో అతడు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. అయితే రాంచీ టెస్టుకు కూడా రాహుల్ ఫిట్గా లేకపోవడంతో.. రోహిత్ సేమ్ సైడ్ కంటిన్యూ చేశాడు కాబట్టే.. రజత్కు అవకాశం వచ్చింది. 6 ఇన్నింగ్స్ల్లో ఖాతా తెరవకుండానే రెండుసార్లు ఔటయ్యాడు. రెండుసార్లు రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయాడు రజత్ పటిదార్.

కాగా, ఈ సిరీస్లో మరో ముగ్గురు ఆటగాళ్లు టీమ్ ఇండియాలో తమ అంతర్జాతీయ కెరీర్ను ప్రారంభించారు. సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్, ఆకాష్ దీప్. ముగ్గురూ దేశవాళీ క్రికెట్లో మంచి ప్రదర్శన కనబరిచి.. టీమిండియాకు ఎంపికయ్యారు. సర్ఫరాజ్, ధృవ్ జురెల్ రాజ్కోట్లో అరంగేట్రం చేయగా, ఆకాష్దీప్ రాంచీ టెస్టులో అరంగేట్రం చేశాడు.

రాజ్కోట్ టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ రెండు ఇన్నింగ్స్ల్లోనూ అద్భుత అర్ధ సెంచరీలు సాధించాడు. ధృవ్ జురెల్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. రాంచీ టెస్టులో ధృవ్ జురెల్ హీరోగా అవతరించాడు. తొలి ఇన్నింగ్స్లో 90 పరుగులు చేశాడు. లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్లతో అద్భుత భాగస్వామ్యాలు ఏర్పరచుకున్నాడు. చేతుల్లోంచి జారిపోయిన టెస్టు మ్యాచ్ని మళ్లీ భారత్ చేతికి అందించాడు. ఆకాష్దీప్ తన తొలి అరంగేట్రం కూడా గుర్తుండిపోయేలా చేశాడు. 2 ఓవర్లలో ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ను షేక్ చేశాడు. మొదట బెన్ డకెట్ను క్యాచ్ అవుట్గా.. ఆ తర్వాత పొప్ను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. తర్వాత జాక్ క్రాలీని బౌల్డ్ చేశాడు. ఈ విధంగా 83 పరుగులకు 3 వికెట్లు తీశాడు.




