బుధవారం ముంబైలో న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో మహ్మద్ షమీ వన్డే ప్రపంచ కప్లో ఒకే ఎడిషన్లో అత్యధిక వికెట్లు తీసిన జహీర్ ఖాన్ రికార్డును బద్దలు కొట్టాడు.
కివీస్పై 57 పరుగులకు ఏడు వికెట్లు తీసిన షమీ.. ప్రస్తుతం జరుగుతున్న టోర్నమెంట్లో కేవలం ఆరు మ్యాచ్లలో 23 వికెట్లు పడగొట్టాడు.
2011 ఎడిషన్లో జహీర్ 21 వికెట్లు పడగొట్టాడు. కివీస్పై 7 వికెట్లు పడగొట్టి, జహీర్ రికార్డును అధిగమించాడు.
2019 ఎడిషన్లో 10 మ్యాచ్లలో 27 వికెట్లు తీసిన ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ వరల్డ్ కప్లో ఒకే ఎడిషన్లో అత్యధిక వికెట్లు తీసిన ఆల్-టైమ్ రికార్డును కలిగి ఉన్నాడు.
ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన సెమీఫైనల్లో న్యూజిలాండ్ను 70 పరుగుల తేడాతో ఓడించి ప్రపంచకప్లో భారత్ 4వసారి ఫైనల్కు చేరుకుంది. ఇంతకుముందు 1983, 2003, 2011లో ఈ టోర్నీ ఫైనల్కు చేరుకుంది.