ఐర్లాండ్పై తొలి టీ20 మ్యాచ్లో 2 పరుగుల తేడాతో భారత్ సాధించిన విజయం, కెప్టెన్గా బూమ్రాకి ఫస్ట్ మ్యాచ్. ఇలా కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే విజయం సాధంచిన బూమ్రా భారత్ తరఫున ఆ ఘనత సాధించిన 9వ టీ20 కెప్టెన్గా అవతరించాడు.
నిజానికి బూమ్రా భారత టీ20 జట్టుకు 11వ కెప్టెన్. అంటే భారత్ టీ20 జట్టుకు సారథ్యం వహించిన వారిలో బూమ్రాతో సహా మొత్తం 9 మంది మాత్రమే కెప్టెన్గా తమ టీ20 మ్యాచ్లో విజయం సాధించారు.
ఇలా విజయం సాధించినవారి లిస్టులో బూమ్రా 9వ కెప్టెన్ కాగా.. అతని కంటే ముందు విరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోని, సురేష్ రైనా, అజింక్యా రహానే, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ ఉన్నారు.
మరి భారత టీ20 జట్టుకు కెప్టెన్గా తమ తొలి మ్యాచ్లో ఓడిన ఆ ఇద్దరు ప్లేయర్లు ఎవరంటే..
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్గా తన తొలి మ్యాచ్ ఓడిపోయాడు. 2017లో ఇంగ్లాండ్తో జరిగిన టీ20 మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
2022లో సౌతాఫ్రికా టూర్ కోసం వెళ్లిన టీమిండియాను రిషభ్ పంత్ నడిపించాడు. అయితే పంత్ కూడా కెప్టెన్గా తన తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఓడిపోయాడు.