
ఐపీఎల్ 2023లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడుతోన్న స్పిన్నర్ రవి బిష్ణోయ్ టీమ్ ఇండియా తరపున కూడా అరంగేట్రం చేశాడు. ఇక్కడకు చేరుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు.

ఐపీఎల్ 2023లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడిన స్టార్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ 2020లో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత, అంటే ఫిబ్రవరి 2022లో, అతను టీ ఇండియా తరపున అరంగేట్రం చేశాడు.

బిష్ణోయ్ రాజస్థాన్లోని జోధ్పూర్ నివాసి. కొన్ని సంవత్సరాల క్రితం 'స్పోర్ట్స్ యారీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిష్ణోయ్ తన ప్రయాణం గురించి చెప్పుకొచ్చాడు. క్రికెట్ అకాడమీలో ఎలా ప్రారంభించాడో, కష్టపడి పిచ్ని తానే ఎలా తయారు చేశాడో చెప్పుకొచ్చాడు.

వైఫల్యం పురోగతిలో ముఖ్యమైన భాగం అని బిష్ణోయ్ తెలిపాడు. అవకాశం దొరికినప్పుడల్లా, దానిని వృధా చేయనివ్వకండి. ఉత్తమమైనదాన్ని అందించండి. నా కోచ్లు ప్రద్యోత్ సింగ్ రాథోడ్, షారుక్ పఠాన్లతో కలిసి జోధ్పూర్లో 'స్పార్టన్' పేరుతో క్రికెట్ అకాడమీని ప్రారంభించినట్లు చెప్పుకొచ్చాడు.

ఈ బౌలర్ మాట్లాడుతూ, “మా దగ్గర డబ్బు లేదు. కాబట్టి మా సహచరులతో చాలా మందితో కలిసి సిమెంట్ బస్తాలు, ఇటుకలను తీసుకున్నాం. ఇలా చాలామంది సహాయం చేశారు. అలాగే పిచ్ను మేమే తయారు చేశాం. నేను నా 12వ పరీక్షల కంటే ముందుగా రాజస్థాన్ రాయల్స్ ట్రయల్స్లో పాల్గొన్నాను. అయినప్పటికీ, నేను ట్రయల్స్లో విఫలమయ్యాను. కానీ నేను ధైర్యం కోల్పోలేదంటూ చెప్పుకొచ్చాడు.

IPL 2022లో 14 మ్యాచ్ల్లో 35.08 సగటుతో 13 వికెట్లు తీశాడు. ఈ సమయంలో ఏకానమీ రేటు 8.44గా నిలిచింది. బిష్ణోయ్ తన IPL కెరీర్లో ఇప్పటివరకు మొత్తం 41 మ్యాచ్లు ఆడాడు. అందులో అతను 27.35 సగటుతో 43 వికెట్లు పడగొట్టాడు.

Ravi Bishnoi