AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: 4 ప్లాన్స్‌తో సిద్ధమైన కెప్టెన్ రోహిత్ శర్మ.. టీమ్ ఇండియాలో కనిపించనున్న మార్పులేంటంటే?

Rahul Dravid-Rohit Sharma: విరాట్ కోహ్లి స్థానంలో రోహిత్ శర్మకు వన్డే, టీ20 జట్టు కమాండ్‌ని అప్పగించారు. పూర్తిస్థాయి వన్డే కెప్టెన్‌గా దక్షిణాఫ్రికాలో తొలి వన్డే సిరీస్‌ ఆడనున్నాడు.

Venkata Chari
|

Updated on: Dec 10, 2021 | 8:22 AM

Share
Rohit Sharma and Virat Kohli

Rohit Sharma and Virat Kohli

1 / 5
రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కలిసి తన రికార్డును పట్టించుకోకుండా జట్టు విజయం గురించి మాత్రమే ఆలోచించే జట్టును సృష్టించాలనుకుంటున్నారు. రోహిత్ శర్మ మాట్లాడుతూ, 'ఐసీసీ టోర్నమెంట్‌లలో బాగా రాణిస్తేనే గుర్తింపు వస్తుంది. ఐసీసీ టోర్నీలో నేనో, మరెవరో సెంచరీ చేసినా పర్వాలేదు. ఆ ఛాంపియన్‌షిప్ గెలవడమే అసలు విషయం' అంటూ చెప్పుకొచ్చాడు.

రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కలిసి తన రికార్డును పట్టించుకోకుండా జట్టు విజయం గురించి మాత్రమే ఆలోచించే జట్టును సృష్టించాలనుకుంటున్నారు. రోహిత్ శర్మ మాట్లాడుతూ, 'ఐసీసీ టోర్నమెంట్‌లలో బాగా రాణిస్తేనే గుర్తింపు వస్తుంది. ఐసీసీ టోర్నీలో నేనో, మరెవరో సెంచరీ చేసినా పర్వాలేదు. ఆ ఛాంపియన్‌షిప్ గెలవడమే అసలు విషయం' అంటూ చెప్పుకొచ్చాడు.

2 / 5
రోహిత్ శర్మ టీమ్ ఇండియాలో అమలు చేయాలనుకుంటున్న మరో భారీ మార్పు ఏమిటంటే ఖచ్చితమైన ప్లేయింగ్ XI. తమ జట్టులో సరైన ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని రోహిత్ శర్మ కోరుకుంటున్నాడు. ఆ ఆటగాళ్లను ప్రోత్సహించాలని, టీమ్ ప్లానింగ్‌లో వారిని కూడా చేర్చాలని కోరుతున్నాడు.

రోహిత్ శర్మ టీమ్ ఇండియాలో అమలు చేయాలనుకుంటున్న మరో భారీ మార్పు ఏమిటంటే ఖచ్చితమైన ప్లేయింగ్ XI. తమ జట్టులో సరైన ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని రోహిత్ శర్మ కోరుకుంటున్నాడు. ఆ ఆటగాళ్లను ప్రోత్సహించాలని, టీమ్ ప్లానింగ్‌లో వారిని కూడా చేర్చాలని కోరుతున్నాడు.

3 / 5
క్లిష్ట పరిస్థితులను అధిగమించడమే రోహిత్ శర్మ టీమ్ ఇండియాలో అమలు చేయాలనుకుంటున్న మూడో పెద్ద విషయం. క్లిష్ట పరిస్థితుల్లోనూ గెలిచే జట్టును నిర్మించాలనుకుంటున్నట్లు రోహిత్ శర్మ తెలిపాడు. సెమీఫైనల్ మ్యాచ్‌లో 10 పరుగులకే 3 వికెట్లు పడిపోయినప్పటికీ మ్యాచ్ గెలవగల జట్టు కావాలని రోహిత్ పేర్కొన్నాడు.

క్లిష్ట పరిస్థితులను అధిగమించడమే రోహిత్ శర్మ టీమ్ ఇండియాలో అమలు చేయాలనుకుంటున్న మూడో పెద్ద విషయం. క్లిష్ట పరిస్థితుల్లోనూ గెలిచే జట్టును నిర్మించాలనుకుంటున్నట్లు రోహిత్ శర్మ తెలిపాడు. సెమీఫైనల్ మ్యాచ్‌లో 10 పరుగులకే 3 వికెట్లు పడిపోయినప్పటికీ మ్యాచ్ గెలవగల జట్టు కావాలని రోహిత్ పేర్కొన్నాడు.

4 / 5
కెప్టెన్‌గా తన ఆటగాళ్లలో భద్రత, విశ్వాసం నింపాలని రోహిత్ శర్మ కోరుకుంటున్నాడు. ఈ రెండూ జరిగితే వారు అత్యుత్తమ ప్రదర్శన చేయగలరు. రోహిత్ శర్మ ప్రకారం, ముంబై ఇండియన్స్ ఐదుసార్లు IPL ఛాంపియన్‌గా అవతరించడానికి కారణం అతని కెప్టెన్సీ కాదు, మంచి ఆటగాళ్లు, వారి ప్రదర్శన మాత్రమేనని తెలుస్తోంది.

కెప్టెన్‌గా తన ఆటగాళ్లలో భద్రత, విశ్వాసం నింపాలని రోహిత్ శర్మ కోరుకుంటున్నాడు. ఈ రెండూ జరిగితే వారు అత్యుత్తమ ప్రదర్శన చేయగలరు. రోహిత్ శర్మ ప్రకారం, ముంబై ఇండియన్స్ ఐదుసార్లు IPL ఛాంపియన్‌గా అవతరించడానికి కారణం అతని కెప్టెన్సీ కాదు, మంచి ఆటగాళ్లు, వారి ప్రదర్శన మాత్రమేనని తెలుస్తోంది.

5 / 5