
జనవరి 3 నుంచి భారత్-శ్రీలంక (IND vs SL) మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. టీమిండియా ఇప్పటికే ఇక్కడ నాలుగు టీ20 మ్యాచ్లు ఆడింది. ఇక్కడ రెండింట్లో గెలుపు, రెండింట్లో ఓటమిని ఎదుర్కోంది.

మొదటి మ్యాచ్: టీమిండియా తన మొదటి మ్యాచ్ని 2012 డిసెంబర్లో ఇంగ్లాండ్తో ఇక్కడ ఆడింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 177 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లీష్ జట్టు చివరి బంతికి సిక్స్ కొట్టి లక్ష్యాన్ని సాధించింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

వెస్టిండీస్తో రెండో మ్యాచ్: టీమిండియా తన రెండో మ్యాచ్ను వెస్టిండీస్తో ఈ మైదానంలో ఆడింది. మార్చి 2016లో జరిగిన ఈ మ్యాచ్లో, టీమ్ ఇండియా తమ టాప్ ఆర్డర్ బలమైన ప్రదర్శన సహాయంతో 192 పరుగుల భారీ స్కోరును సాధించింది. దానికి సమాధానంగా విండీస్ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేసి మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో మ్యాచ్ను గెలుచుకుంది.

శ్రీలంతో మూడో మ్యాచ్: వాంఖడే వేదికగా జరిగిన తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిన టీమిండియా.. తర్వాతి రెండు మ్యాచ్ల్లో విజయం సాధించింది. డిసెంబర్ 2017లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక కేవలం 135 పరుగులకే కుప్పకూలింది. అనంతరం భారత్ చివరి ఓవర్లో లక్ష్యాన్ని సులభంగా విజయం సాధించింది.

వెస్టిండీస్తో నాలుగో మ్యాచ్: 2019 డిసెంబర్లో జరిగిన మరో మ్యాచ్లో వెస్టిండీస్పై భారత జట్టు 67 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 240 పరుగులు చేసింది. అనంతరం వెస్టిండీస్ 173 పరుగులు మాత్రమే చేయగలిగింది.