
ఐపీఎల్ 2023లో మరో ఆసక్తికరమైన ఘట్టానికి తెర లేచింది. బుధవారం చెన్నై సూపర్ కింగ్స్- రాజస్థాన్ రాయల్స్ పోరాటంలో ఓ మైలు రాయి రికార్డు క్రియేట్ అయ్యింది. చెన్నై చెపాక్లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఓ హిస్టరీ నెలకొంది.

చెన్నై సూపర్ కింగ్స్కు ఇది 200 మ్యాచ్. ధోనీ సారథ్యంలో తన ల్యాండ్ మార్క్ మ్యాచ్ను బ్రేక్ చేశాడు. ధోనీ కేప్టెన్సీలో సీఎస్కే.. తిరుగులేని జట్టుగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. అయితే, ఐపీఎల్లో సెకెండ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ టీం ఇదే అని చెప్పాలి

ధోనీ కేప్టెన్సీలో ఇప్పటివరకు 11 సార్లు ప్లేఆఫ్స్కు చేరింది చెన్నై సూపర్ కింగ్స్. నాలుగుసార్లు టైటిల్స్ గెలుచుకుంది. అయిదు సార్లు ఫైనల్స్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

2008, 2009, 2018, 2021లో ఐపీఎల్ కప్ను ఎగరేసుకెళ్లిందీ ఎల్లో ఆర్మీ. 2016, 2017 సీజన్ల నుంచి తప్పుకొంది. 2000, 2022 సీజన్లల్లో అత్యంత అధ్వాన్న ఆటతీరును ప్రదర్శించింది చెన్నై సూపర్ కింగ్స్. కనీసం ప్లేఆఫ్స్ కూడా చేరలేదు.

ధోనీ కేప్టెన్సీలో ఇప్పటివరకు 11 సార్లు ప్లేఆఫ్స్కు చేరింది చెన్నై సూపర్ కింగ్స్. నాలుగుసార్లు టైటిల్స్ గెలుచుకుంది. అయిదు సార్లు ఫైనల్స్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. 2008, 2009, 2018, 2021లో ఐపీఎల్ కప్ను ఎగరేసుకెళ్లిందీ ఎల్లో ఆర్మీ. 2016, 2017 సీజన్ల నుంచి తప్పుకొంది. 2000, 2022 సీజన్లల్లో అత్యంత అధ్వాన్న ఆటతీరును ప్రదర్శించింది చెన్నై సూపర్ కింగ్స్. కనీసం ప్లేఆఫ్స్ కూడా చేరలేదు.

ఇప్పటి వరకు ధోని ఐపీఎల్లో మొత్తం 207 మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించగా, ఇందులో సీఎస్కే తరఫున 199 మ్యాచ్లు ఉన్నాయి. ఇందులో అతను 123 మ్యాచ్లు గెలిచాడు. 83 మ్యాచ్ల్లో ఓడిపోయింది.

అంతే కాదు, కెప్టెన్గా విరాట్ కోహ్లీ తర్వాత ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు కూడా ధోని. కెప్టెన్గా ధోనీ 4482 పరుగులు చేయగా, విరాట్ 4481 పరుగులు చేశాడు.