
సంక్రాంతి సీజన్ మనకి ఎంత ఇంపార్టెంటో, తమిళనాడులో పొంగల్ సీజన్కి అంతే క్రేజ్ ఉంటుంది. పెద్ద హీరోలందరూ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడటానికి రెడీ అవుతారు. 2025లో అజిత్, సూర్య, విక్రమ్ వస్తారనుకున్నారు... కానీ.. ఇప్పుడు వారిలో వచ్చే వారు ఎంత మంది? గేమ్ చేంజర్తో గ్రౌండ్లో దిగేవారు ఎంత మంది? కమాన్ లెట్స్ వాచ్...

జరగండి జరగండి అంటూ గ్లోబల్ స్టార్ రామ్చరణ్ని వెంట పెట్టుకుని రంగంలోకి దూకుతున్నారు శంకర్. ఈ సారి సక్సెస్ కొట్టి చూపిస్తామన్నది శంకర్ ధీమా. ట్రిపుల్ ఆర్ క్రేజ్ని గేమ్ చేంజర్తో క్యాష్ చేసుకోవాలన్నది టీమ్ ప్లాన్. ఎలాగైనా జనవరి 10 సాయంత్రం సినిమా సక్సెస్ పోస్టులు చూడాలన్నది చెర్రీ కోరిక.

ఇంట గెలిచి రచ్చ గెలవడం కాదు... సైమల్ టైనియస్గా గ్లోబల్ రేంజ్లో గెలవాలని ప్లాన్ చేస్తోంది యూనిట్. అందుకే అన్ని చోట్లా ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారు. సడన్గా చెర్రీతో పోటీకొచ్చేశారు అజిత్. ఆయన నటించిన విడాముయర్చిని పొంగల్ రేసులోకి తీసుకొస్తామంటున్నారు మేకర్స్.

ముందు అనుకున్న ప్రకారం అయితే పొంగల్ రేసులో విక్రమ్ మూవీ వీర ధీర సూరన్ పార్ట్ 2 ఉండేది. ఈ ఏడాది అక్టోబర్లో రావాల్సిన ఈ సినిమాను నెక్స్ట్ ఇయర్ పొంగల్కి రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ, ఇప్పుడు సంక్రాంతి నుంచి కూడా షిఫ్ట్ అయింది వీరధీర సూరన్.. నెక్స్ట్ సమ్మర్కి ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది.

పొంగల్ సీజన్ అంటే.. ఒకటికి నాలుగు సినిమాలు వచ్చినా చూడ్డానికి ప్రేక్షకులు రెడీగా ఉంటారు. కంటెంట్ బావుండి, జనాలను మెప్పించాలే గానీ బాక్సాఫీస్ నెంబర్లకు కొదవే ఉండదు. అందుకే అజిత్ మూవీ బరిలో ఉన్నా... గేమ్ చేంజర్ రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టడానికి ఫుల్ స్కోప్ ఉంది.. మరి శంకర్ ఈ ఛాన్సును ఎలా వాడుకుంటారో చూడాలి.