
ప్రస్తుతం జాక్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది హీరోయిన్ వైష్ణవి చైతన్య. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి చెప్పుకొచ్చింది వైష్ణవి చైతన్య.

కూచిపుడి, పాశ్చాత్య నృత్యంలో తనకు ప్రావీణ్యం ఉందని.. పాటలు కూడా బాగా పాడతానని చెప్పుకొచ్చింది. గంగూబాయి కతియావాడి సినిమాలో అలియా భట్ నటకు ఫిదా అయ్యానని.. అలాంటి పాత్రలు వస్తే.. ఎంత కష్టమైన నటించేందుకు రెడీ అని తెలిపింది.

స్కూల్లో తనకు చాలా క్రష్ లు ఉండేవని.. పూర్తిస్థాయి రిలేషన్ షిప్ లోకి అడుగుపెట్టింది మాత్రం పద్దెనిమిదేళ్ల వయుసలోనే అని తెలిపింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల తమ బంధం ముందుకు వెళ్లలేకపోయిందని.. కానీ ఫస్ట్ లవ్ ఎప్పటికీ సమ్ థింగ్ స్పెషల్ అని చెప్పుకొచ్చింది.

అలాగే తన ఫస్ట్ క్రష్ హీరో రామ్ పోతినేని అని తెలిపింది. అబ్బాయిల్లో మొదటగా అతడి కళ్లు, నవ్వు మాత్రమే గమనిస్తానని చెప్పుకొచ్చింది. అనుష్క, సాయి పల్లవి తన ఫేవరేట్ హీరోయిన్స్ అని తెలిపింది.

తన ఫస్ట్ పారితోషికం రూ.3 వేలు అని.. తనను సహజనటి జయసుధతో చిరంజీవి పోల్చడం జీవితంలో మర్చిపోలేని ప్రశంస అని తెలిపింది. బేబీ సినిమా తర్వాత అభిమానుల నుంచి చాలా ప్రపోజల్స్ వచ్చాయని చెప్పుకొచ్చింది.