
అందం, అభినయంతో సినీ పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమెజ్ క్రియేట్ చేసుకుంది త్రిష.

అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించి టాలీవుడ్ అగ్రకథానాయికలలో ఒకరిగా దూసుకుపోయింది ఈ ముద్దుగుమ్మ

కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళ్, మలయాళం ఇండస్ట్రీలలో కూడా వరుస ఆఫర్లను అందుకుంటూ బిజీ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది.

అయితే గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది త్రిష. చాలా కాలం గ్యాప్ తర్వాత తిరిగి టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తుంది.

వెండితెరపైనే కాకుండా.. ఓటీటీలోనూ సత్తా చాటుతోంది త్రిష. తెలుగులో ఓ వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. త్రిష ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ కు బృంద అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్.

దసరా రోజున ప్రారంభమైన ఈ సిరీస్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది.