సీనియర్లు అయిపోయారు.. అవకాశాలు తగ్గిపోయాయి.. కుర్ర హీరోయిన్లు వచ్చారు.. కామ్గా సైడ్ ఇవ్వడం తప్ప ఇంక వీళ్ళేం చేస్తారులే అనుకుంటున్నారేమో..? మేం గ్లామర్ షో చేయడం మొదలుపెడితే.. మాతో పోటీ ఎవరూ పడలేరు.. మా షోకు మతులు పోతాయంటే అంటున్నారు సీనియర్ హీరోయిన్లు. ఈ మధ్య డోస్ పెంచేసిన బ్యూటీస్ ఎవరో ఎక్స్క్లూజివ్లో చూద్దాం..
టాలీవుడ్లో ప్రస్తుతం మృణాళ్ ఠాకూర్, శ్రీలీల లాంటి హీరోయిన్ల ట్రెండ్ నడుస్తుంది. రేసులో వీళ్లు ముందున్నా.. మేమేం తక్కువ కాదంటూ ఎప్పటికప్పుడు గ్లామర్ షోతో గుర్తు చేస్తున్నారు సీనియర్ హీరోయిన్లు. అనుపమనే తీసుకోండి.. టిల్లు స్క్వేర్తో అమ్మడు చేసిన అందాల అరాచకానికి కుర్రాళ్లంతా ఫిదా అయిపోతున్నారు. ఆ మత్తులోంచి బయటికే రాలేకపోతున్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ సైతం గ్లామర్ షోలో నో కాంప్రమైజ్ అంటున్నారు. పెళ్లై నెల కూడా కాకుండానే అదిరిపోయే హాట్ ఫోటోషూట్ చేసారు ఈ బ్యూటీ. ఇదిప్పుడు వైరల్ అయి కూర్చుంది. పెళ్లి అనేది కెరీర్కు అడ్డే కాదని.. దీనికి దానికి సంబంధమే లేదంటున్నారు ఈ బ్యూటీ. అందుకే ఎప్పటికప్పుడు గ్లామర్తో పరేషాన్ చేస్తుంటారు రకుల్.
సమంత కూడా తక్కువేం తినట్లేదు. మయోసైటిస్ నుంచి మెల్లగా బయట పడుతున్న స్యామ్.. తన రీ ఎంట్రీని ఘనంగానే ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే హాట్ ఫోటోషూట్స్ చేస్తున్నారు. శృతి హాసన్, తమన్నా ఐతే చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ అందాలతో విందు ఇస్తూనే ఉంటారు ఈ బ్యూటీస్.
కంపేరిజన్ ఎందుకు అని ఒక వైపు మనసుకు ఎంత నచ్చజెప్పుకున్నా, పీర్ గ్రూప్తో ఏదో ఒక రకంగా కంపేర్ చేసుకోకుండా ఉండలేదు గ్లామర్ ఇండస్ట్రీ. ఇప్పుడు నయనతార, త్రిష సూపర్డూపర్ సక్సెస్లు చూస్తూ దూసుకుపోతుంటే, చాలా మంది సమకాలీనులు తామెక్కడున్నామో ఓ సారి రియాలిటీ చెక్ చేసుకుంటున్నారు.