
23 ఫిబ్రవరి 1994న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గర్వాల్ లో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది ట్రిప్టి డిమ్రి. ఈ ముద్దుగుమ్మ తల్లి పేరు మీనాక్షి. తండ్రి పేరు దినేష్. తన కెరీర్లో విషయంలో వీరిద్దరూ ఎల్లప్పుడూ తనకు సపోర్టివ్ గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది ఈ భామ.

ఫిరోజాబాద్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో పాఠశాల విద్యను అభ్యసించింది. శ్రీ అరబిందో కళాశాల (ఈవెనింగ్) నుంచి ఇంగ్లీష్ హానర్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆమె గ్రాడ్యుయేషన్ తర్వాత పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో నటనను కొనసాగించింది.

శ్రేయాస్ తల్పాడే దర్శకత్వం వహించిన 2017 కామెడీ చిత్రం పోస్టర్ బాయ్స్తో తన సినీ రంగ ప్రవేశం చేసింది. ఇందులో సన్నీ డియోల్, బాబీ డియోల్, తల్పాడే ప్రధాన పాత్రల్లో నటించారు. మరాఠీ చిత్రం పోస్టర్ బాయ్జ్ యొక్క అధికారిక రీమేక్, ఇది తల్పాడే యొక్క ప్రేమ ఆసక్తిని కలిగి ఉంది.

తర్వాత అవినాష్ తివారీ సరసన 2018 రొమాంటిక్ డ్రామా లైలా మజ్నులో ప్రధాన పాత్రలో కనిపించింది. తర్వాత బుల్బుల్ బుల్బుల్. ఖలా వంటి చిత్రాల్లో కథానాయకిగా ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ.

2023లో యానిమల్ సినిమాలో జోయా పాత్రలో నటించి పాన్ ఇండియా బ్లాక్ అందుకుంది. ప్రస్తుతం బాడ్ న్యూజ్, విక్కీ విద్యా కా వో వాలా వీడియో , భూల్ భూలైయా 3 వంటి చిత్రాల్లో నటిస్తుంది. వీటితో పాటు యానిమల్ పార్క్ లో కూడా నటించనుంది.