
ప్రస్తుతం దక్షిణాది సినీ పరిశ్రమలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న ముద్దుగుమ్మ ఆమె. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. గ్లామరస్ షో లేకుండానే ఇండస్ట్రీని ఏలేస్తుంది. ఒక్కో సినిమాకు కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటుంది. ఇంతకీ ఆమెను గుర్తుపట్టారా.. ?

కేవలం 5 వేలతో కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ మరెవరో కాదు.. న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి సినీరంగంలో తనదైన ముద్ర వేసింది.

2024లో విడుదలైన శివకార్తికేయన్ 'అమరన్' తర్వాత తెలుగులో తండేల్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బ్యాక్ సైడ్ డ్యాన్సర్ గా పలు సినిమాల్లో కనిపించిన ఆమె.. ప్రేమమ్ సినిమాతో నటిగా మారింది. బ్యాక్ సైడ్ డ్యాన్సర్ గా చేస్తున్న సమయంలో కేవలం రూ.5 వేలు జీతం తీసుకుంది.

2015లో ప్రేమమ్ చిత్రంలో హీరోయిన్గా అరంగేట్రం చేసింది. ఈ సినిమాతో ఆమె దక్షిణ భారతదేశం అంతటా అందరి దృష్టిని ఆకర్షించింది. 2024లో శివకార్తికేయన్ తో అమరన్ సినిమా ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. నటుడు అమీర్ ఖాన్ నిర్మిస్తున్న కొత్త సినిమా ఏక్ దిన్ తో సాయి పల్లవి బాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది.

అలాగే రణబీర్ కపూర్ చిత్రం రామాయణంలో సీత పాత్రను పోషిస్తుంది. ఈ చిత్రానికి ఆమె రూ.10 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. అలాగే ఇప్పుడు మళ్లీ ఆమె ధనుష్ జతగా కనిపించనున్నట్లు సమాచారం. మారి తర్వాత ధనుష్, సాయి పల్లవి జతకట్టడం ఇది రెండోసారి.