ధనుష్, విజయ్ సేతుపతి, అంజలి, సిమ్రాన్, ధనుష్.. వీళ్ల వయసు అప్పుడూ ఏదు పదులకు చేరిపోయిందా అని అనుకుంటున్నారా? కానేకాదు. నిజానికి సిమ్రాన్ వయసే యాభైకి చేరువలో ఉంది. సిమ్రాన్ యాభైలోకి అడుగుపెట్టడానికి ఇంకో రెండు మూడేళ్లు పడుతుంది. ఇక ధనుష్, భరత్ నలభై టచ్ చేశారు. సేతుపతి 45 టచ్ చేశారు. అంజలి అయితే నలభై లోపే. ఈ అయిదుగురూ అయిదుపదుల్లో పడింది సినిమాల పరంగా అనే విషయం మీకు ఇప్పటికే అర్ధమై ఉంటుంది. ఈ ఐదుగురూ చేస్తున్న 50వ సినిమా విశేషాలు ఇవే..
హీరో ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘నాన్ రుద్రన్’. ఇది ధనుష్ 50వ సినిమా. తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మువీ 2024లో విడుదలయ్యే అవకాశం ఉంది.
నటుడు విజయ్ సేతుపతి 50వ సినిమా‘మహారాజా’. ఈ మువీలో మమతా మోహన్దాస్, నట్టి నటరాజ్, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకున్నీ ఈ మువీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. విడుదలకు సిద్ధమై పోతుంది.
దక్షిణాది హీరోయిన్ అంజలి కూడా తన కెరీర్లో హాఫ్ సెంచరీ మైల్స్టోన్కు చేరుకున్నారు. అశోక్ వేలాయుధం దర్శకత్వంలో ‘ఈగై’ అనే మువీలో లా స్టూడెంట్గా నటిస్తున్నారు. ఈ కోర్టు డ్రామా మూవీ త్వరలో విడుదల కానుంది.
హీరోయిన్గా సిమ్రాన్. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. తమిళంలో సిమ్రాన్ 50వ సినిమా ‘ఈరమ్’ (తెలుగులో ‘వైశాలి’). ఆది పినిశెట్టి హీరోగా, లక్ష్మీ మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సిమ్రాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
‘ప్రేమిస్తే..’ మువీ ఫేమ్ భరత్ 50వ సినిమా ‘లవ్’. ఆర్పీ బాలా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మువీ జులై 28న విడుదలకు సిద్ధంగా ఉంది.