
మలయాళీ చిత్రపరిశ్రమలో ఆమె క్రేజీ బ్యూటీ. తక్కువ సమయంలోనే నటిగా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మడు.. తెలుగులో మాత్రం ఇప్పటివరకు ఒక్క సినిమా చేయలేదు. ప్రస్తుతం ప్రభాస్ సరసన నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. కెరీర్ మొదట్లో ఎదురైన విమర్శలను బయటపెట్టింది.

ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ మాళవిక మోహనన్. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తూన్న ది రాజాసాబ్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనుంది ఈ ముద్దుగుమ్మ. అలాగే ఈ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవి మూవీలో నటిస్తున్నట్లు రూమర్స్ రాగా.. అవన్నీ అవాస్తవం అంటూ కొట్టిపారేసింది.

ఈ అమ్మడు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పేట చిత్రంలో కీలకపాత్రలో కనిపించింది. తాజాగా మాళవిక మాట్లాడుతూ.. నటీనటులకు పర్ఫెక్ట్ లాంచ్ అవసరం అని అనుకున్నట్లు తెలిపారు. తాను కూడా పెద్ద సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలనుకున్నానని అన్నారు.

దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తనకు రజినీకాంత్ పేట సినిమాలో అవకాశం ఇచ్చారు. రజినీతో నటించే అదృష్టాన్ని వదులుకోవాలని అనుకోలేదు. కానీ ఆ సినిమా తర్వాత అలాంటి అవకాశాలు వచ్చాయి. ఇక పై సైడ్ రూల్స్ మాత్రమే వస్తాయని కొందరు అన్నారు.

నటీనటులను ఇంత త్వరగా జడ్జ్ చేస్తారని అప్పుడే అర్థమైంది. ఒక పెద్ద సినిమా ఆఫర్ వచ్చినప్పటికీ కథ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశాను. నేను మంచి పాత్రలు మాత్రమే చేస్తానని చెప్పకనే చెప్పాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రాజాసాబ్ చిత్రంలో నటిస్తుంది ఈ అమ్మడు.