ప్రముఖ తమిళ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ రాజీవ్మీనన్ తాజాగా నటుడుగానూ మారాడు. తమిళంలో వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన విడుదలై మువీలో కీలక పాత్రలో నటించారు. తాజాగా వెపన్ అనే మరో చిత్రంలో విలన్ పాత్రలో నటించారు కూడా.
ఈ సినిమా త్వరలో థియేటర్లలో విడుదలవనుంది. ఇక రాజీవ్మీనన్ వారసురాలు సరస్వతి కూడా కథానాయకిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.
తమిళ రాజకీయాలను ఫోకస్ చేస్తూ మూమెంట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై జీఏ హరికృష్ణన్ నిర్మిస్తోన్న చిత్రంలో సరస్వతి హీరోయిన్గా నటిస్తున్నారు.
ఈ మువీకి ఈ రంగనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు సెల్వరాఘవన్, యోగిబాబు, సునీల్, షైన్ టామ్ చాకో, రాధారవి, వినోదిని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఐతే ఈ మువీకి ఇంకా టైటిల్ ఖరారుకాలేదు. సరస్వతి ఈ మువీ కంటే ముందు 'సర్వం తాళమయం' అనే మువీలోని ఓ పాటలో కనిపించారు. సరస్వతి నటిస్తోన్న కొత్త మువీ చిత్రీకరణ దిండిగల్, రామనాథపురం, కొడైకెనాల్లలో జరుగుతోంది.