మన హీరోయిన్లు నార్త్ లో సక్సెస్ కావాలంటే వెంట సౌత్ కెప్టెన్ ఉండి తీరాల్సిందేనా? లేకుంటే అక్కడ నెగ్గుకు రావడం అంత తేలిక కాదా? ఇప్పుడు సౌత్ సర్కిల్స్ లో ఈ విషయం తెగ వైరల్ అవుతోంది. ఆల్రెడీ జరిగిన విషయాలు, ఇప్పుడు సెట్స్ మీదున్న సంగతులను గమనిస్తే, ఈ విషయాన్ని నమ్మి తీరాల్సిందేనని అంటున్నారు క్రిటిక్స్.
నేను నార్త్ లో ప్రాజెక్ట్ చేస్తే, సౌత్ నుంచి వంద మందిని తీసుకెళ్తానని అన్నారు అట్లీ. అనడమే కాదు, నయనతారను నార్త్ లో వెయ్యి కోట్ల సినిమాతో లాంచ్ చేశారు. అప్పటిదాకా నార్త్ లో ఏవో సినిమాలు చేస్తున్న రష్మిక మందన్నకు స్ట్రాంగ్ ఫిల్మ్ ఇచ్చారు సందీప్ రెడ్డి వంగా. యానిమల్ తర్వాత ఉత్తరాదిన కూర్గు గర్ల్ ఇమేజ్ కంప్లీట్గా మారిపోయింది.
ఆల్రెడీ నార్త్ వెబ్ సీరీస్ ఫ్యామిలీమేన్2తో ప్రూవ్ చేసుకున్నారు సామ్. ఆమెకు అక్కడ సపోర్టింగ్ సిస్టమ్గా నిలిచిన రాజ్ డీకే గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అక్కర్లేదు.
వీరందరినీ గమనించిన కీర్తీ సురేష్ కూడా నార్త్ ట్రిప్కి అట్లీ ప్రొడక్షన్నే గట్టిగా నమ్ముకున్నారు. దశాబ్దంన్నర తర్వాత నార్త్ జర్నీ షురూ చేయాలనుకున్న త్రిష కూడా ఇప్పుడు ఈ ట్రెండ్నే ఫాలో అవుతున్నారు.
షేర్షాతో నార్త్ లో సక్సెస్ అయిన విష్ణు వర్ధన్ సినిమాతోనే త్రిష నార్త్ ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సల్మాన్ సినిమాకు త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, బాలీవుడ్లో ఇంకో సారి తన లక్ ట్రై చేయాలని అనుకుంటున్నారని చెప్పుకుంటున్నారు తమిళ తంబిలు.