
శోభితా ధూళిపాళ 31 మే 1992న ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి వేణుగోపాలరావు, మర్చంట్ నేవీ ఇంజనీర్. ఆమె తల్లి శాంతా కామాక్షి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు.

ఆమె విశాఖపట్నంలో పెరిగింది. ఆమె పదహారేళ్ల వయసులోనే ఒంటరిగా ముంబైకి వెళ్లి కార్పొరేట్ లా చదువు కోసం ముంబై విశ్వవిద్యాలయంలో H.R. కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్లో చేరింది. ఆమె భరతనాట్యం మరియు కూచిపూడిలో శిక్షణ పొందిన క్లాసికల్ డ్యాన్సర్.

2016లో రామన్ రాఘవ్ 2.0లో విక్కీ కౌశల్ సరసన తన సినీ రంగ ప్రవేశం చేసింది. జూలై 2016లో ఫాంటమ్ ఫిల్మ్స్తో మూడు చిత్రాల ఒప్పందంపై సంతకం చేసింది. ఈ చిత్రంలో ఆమె పాత్ర కోసం, ఆమె కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2016లో డైరెక్టర్స్ ఫోర్ట్నైట్లో ఉత్తమ సహాయ నటనకు విమర్శకులచే నామినేట్ చేయబడింది.

2018లో అడివి శేష్ హీరోగా నటించింది గూఢచారి సినిమాతో తొలిసారి తెలుగులో నటించింది ఈ వయ్యారి. తర్వాత 2022లో అడివి శేష్ తెలుగు బయోపిక్ చిత్రం మేజర్ లో కనిపించింది. ఈ రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి.

మణిరత్నం తెరకెక్కించిన పీరియాడికల్ ఫిల్మ్ పొన్నియిన్ సెల్వన్: I. దాని సీక్వెల్ పొన్నియిన్ సెల్వన్: II, వానతిగా కనిపించింది. ఆ తర్వాత ఆమె ది నైట్ మేనేజర్ రెండు సీజన్లలో అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్లతో కలిసి నటించింది. ఈ వెబ్ సిరీస్ కి ఉత్తమ నటిగా ITA అవార్డును గెలుచుకుంది.