చాలా మంది హీరోయిన్లు సందీప్రెడ్డి వంగా సినిమాల్లో నటించాలని ఉందంటూ ఇష్టాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ మధ్య హ్యూమా ఖురేషి యానిమల్ సినిమా గురించి మాట్లాడారు. సందీప్ రెడ్డి యానిమల్ తనకు నచ్చిందని, అతని సినిమాల్లో మంచి కేరక్టర్ ఉంటే చేయాలని భావిస్తున్నానని అన్నారు. ఇప్పుడు వరుణ్తేజ్ హీరోయిన్ మానుషి చిల్లర్ కూడా సందీప్ రెడ్డి ప్రస్తావన తెస్తున్నారు.
సందీప్ రెడ్డి వంగా ఫోర్త్ కమింగ్ సినిమాల్లో తన పార్టిసిపేషన్ ఉంటే లక్కీగా ఫీలవుతానని స్టేట్మెంట్ ఇచ్చారు. ఆల్రెడీ అర్జున్రెడ్డి విడుదలైనప్పుడు ఈ ఫాలోయింగ్ విజయ్ దేవరకొండకి కనిపించింది. బార్డర్లు దాటి.. యంగ్ హీరోయిన్లందరూ విజయ్ దేవరకొండతో పనిచేయాలని ఇంట్రస్ట్ చూపించారు. ఇప్పుడు యానిమల్ విషయంలో ఆ ఫోకస్ డైరక్టర్ సందీప్ మీదకు మళ్లింది.
కృతి కర్బంద బోణీ, ఒంగోలు గిత్తతో పాటు పలు సినిమాల్లో నటించారు. కన్నడ, హిందీలో ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నారు. గత కొంతకాలంగా కృతి కర్బందకు, పుల్కిత్ సామ్రాట్కు మధ్య సమ్థింగ్ సమ్థింగ్ అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ విషయాన్ని ఎప్పుడూ దాచడానికి ఇష్టపడలేదు కృతి కర్బంద. అలాగని ఆమె ఎప్పుడూ ఈ విషయాన్ని ఓపెన్గానూ షేర్ చేసుకోలేదు.
ఫస్ట్ టైమ్, తన రిలేషన్ షిప్ గురించి ఓపెన్ అయ్యారు కృతి. మార్చి 13న పుల్కిత్ సామ్రాట్ను వివాహం చేసుకుంటానంటూ మనసులో మాట చెప్పేశారు. మార్చి నుంచి మనం కలిసి సాగుదాం అని కృతి చెప్పిన మాటకు, నేనూ నీతోనే అంటూ సరదాగా స్పందించారు పుల్కిత్. పెళ్లయ్యాక కూడా కృతి సినిమాల్లో కంటిన్యూ అవుతారు. ప్రస్తుతం రిస్కీ రోమియో సినిమా ఆమెకు సెట్స్ మీదుంది.
నార్త్ కి వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ సినిమాలే చేతినిండా ఉన్నాయని గతంలో చాలా సార్లు చెప్పారు నయన్. అయితే ఆఫర్, అట్లీ నుంచి వచ్చేసరికి, అందులోనూ షారుఖ్ హీరో అనేసరికి, నో చెప్పలేకపోయారు. ఎందుకంటే, హిందీలో నయన్ చూడని సినిమాలు అసలు ఉండవంటే నమ్మాల్సిందేనట. బాలీవుడ్ ప్రాజెక్టుల మీద అంత గ్రిప్ ఉంటుందట నయన్కి. అందులోనూ ఆమె షారుఖ్కి అతి పెద్ద ఫ్యాన్. అందుకే జవాన్లో ఆమె నటిస్తున్నారన్నప్పుడు నార్త్ నుంచి కూడా వార్మ్ వెల్కమ్ లభించింది. ఇప్పుడు ఆమె నిర్ణయానికి ప్రాపర్ అక్రిడేషన్ లభించినట్టయింది. లేటెస్ట్ గా దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు అందుకున్నారు నయన్. అవార్డుల స్టేజ్ మీద ఎల్లో శారీలో గోల్డెన్ దివా అనిపించారు నయన్.