
సమంత ఏం చేస్తున్నారు..? కొత్త సినిమాలకు ఎందుకు సైన్ చేయట్లేదు..? ఇంకా అనారోగ్యంగానే ఉన్నారా..? పైగా మొన్నటికి మొన్న డాక్టర్ సెషన్ కూడా అయిపోయిందన్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో సమంతను మళ్లీ స్క్రీన్ మీద చూడగలమా లేదా..? ఇలా ఎన్నో ప్రశ్నల మధ్య సమాధానం ఇచ్చేసారు సమంత. ఏకంగా మెగాస్టార్ సినిమాకు సైన్ చేసారు ఈ బ్యూటీ.

ఖుషీ తర్వాత మళ్లీ స్క్రీన్ మీద కనిపించలేదు సమంత. కనీసం నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటో కూడా చెప్పలేదు. ఒప్పుకున్న వరకు పూర్తి చేసి.. హెల్త్పై ఫోకస్ చేసారు ఈ బ్యూటీ. పైగా సద్గురు ఆశ్రమానికి వెళ్లి ఆధ్యాత్మిక చింతనలో కనిపించారు. ఈమె తీరు చూసాక.. ఇప్పట్లో సినిమాలు చేయడం కష్టమే అనుకున్నారు కానీ అంతలోనే కొత్త సినిమాకు ఓకే చెప్పారు స్యామ్.

కొన్ని రోజులుగా కేవలం యాడ్స్ మాత్రమే చేస్తున్నారు సమంత. అది కూడా సౌత్ కాదు.. బాలీవుడ్ నటులతోనే కమర్షియల్స్లో నటిస్తున్నారు. అయితే చాలా నెలల తర్వాత తనకు లైఫ్ ఇచ్చిన దర్శకుడి కోసం సౌత్ సినిమా ఓకే చేసారు సమంత. ఏ మాయ చేసావే, ఎటో వెళ్లిపోయింది మనసు లాంటి సినిమాల తర్వాత గౌతమ్ మీనన్తో సినిమా చేయబోతున్నారు స్యామ్.

మమ్ముట్టి హీరోగా గౌతమ్ మీనన్ ఓ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో సమంత హీరోయిన్గా నటిస్తున్నారు. జూన్ 15 నుంచి రెగ్యులర్ షూట్ మొదలు కానుంది. 20 నుంచి సమంత, మమ్ముట్టి జాయిన్ కానున్నారు.

ఈ సినిమాతోనే మలయాళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు సమంత. గౌతమ్ మీనన్ కోసమే సౌత్ సినిమా చేస్తున్నారా లేదంటే ఇకపై కంటిన్యూ అవుతారా అనేది త్వరలోనే తేలనుంది.