
ప్రభాస్ ఫ్యాన్స్కు ఓ గుడ్ న్యూస్ వస్తే.. వెంటనే ఓ షాకింగ్ న్యూస్ కూడా వినిపిస్తుంది. తాజాగా ఇదే జరిగింది. నిన్నగాక మొన్న మొదలైన హను రాఘవపూడి సినిమా అప్డేట్స్ కూడా వస్తున్నాయి కానీ రాజా సాబ్ మాత్రం రావట్లేదు. పైగా ఈ సినిమాపై తాజాగా మరో షాకింగ్ న్యూస్ వినిపిస్తుంది. మరి అదేంటి..? దాని వల్ల ఫ్యాన్స్కు వచ్చిన నష్టమేంటి..? ఎక్స్క్లూజివ్గా చూద్దాం..

బాహుబలి తర్వాత ప్రభాస్తో రెగ్యులర్ సినిమాలు చేయడమే మరిచిపోయారు దర్శకులు. ఆయన డేట్స్ ఇస్తే చాలు.. భారీ యాక్షన్ సినిమాలు లేదంటే లార్జర్ దెన్ లైఫ్ కారెక్టర్లు చేయిస్తూ ఒకప్పటి డార్లింగ్ను మర్చిపోయేలా చేసారు దర్శకులు. మధ్యలో రాధే శ్యామ్లో లవర్ బాయ్లా కనిపించినా.. అందులోనూ భారీగా విజువల్ ఎఫెక్ట్స్ జొప్పించారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్.

సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి.. ఇలా ఏ సినిమా తీసుకున్నా బడ్జెట్ వందల కోట్లు పక్కా. ఇలాంటి సమయంలో కాస్త రిలీఫ్ కోసం చిన్న సినిమా చేయాలని అనుకున్నారు ప్రభాస్. అలా చేస్తున్నదే మారుతితో రాజా సాబ్. మిగిలిన వాటితో పోల్చినపుడు ఇది చిన్న సినిమా అనిపిస్తుందేమో గానీ.. దీనికోసం కూడా 250 కోట్లు ఖర్చు చేస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.

సినిమా మొదలైన తరువాత ఆరు నెలల్లోనే ఆ సినిమాను రిలీజ్ చేయాలన్న కండిషన్ మీదే సినిమాకు సైన్ చేస్తున్నారు. ప్రతీ ఏడాది రెండు సినిమాలు పక్కాగా రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ రేంజ్ సినిమాలను 90 రోజుల్లో షూట్ చేసి, ఆరు నెలల్లో రిలీజ్ చేయటం అంటే మామూలు విషయం కాదు. మరి డార్లింగ్ ఈ విషయంలో ఎంత వరకు సక్సెస్ అవుతారో చూడాలి.