
టాలీవుడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి తన ఇన్ స్టాలో షేర్ చేసిన లేటేస్ట్ ఫోటోస్ వైరలవుతున్నాయి. సముద్ర తీరాన పింక్ శారీలో మతిపోగొట్టేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫోటోలకు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలోని బిజీ హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. ఆ తర్వాత కొంతకాలం బ్రేక్ తీసుకుంది.

ఇటీవల హిట్ 2 సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో సౌత్ ఇండస్ట్రీలోకి మీనాక్షికి అవకాశాలు క్యూ కట్టాయి. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజిగా ఉంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న గుంటూరు కారం సినిమాలో నటిస్తుంది మీనాక్షి. ఇందులో శ్రీలీల సైతం నటిస్తుండగా.. మెయిన్ హీరోయిన్ గా ఈ ముద్దుగుమ్మ కనిపించనుందని టాక్.

అలాగే విజయ్ దళపతి కొత్త సినిమాలోనూ నటిస్తుంది. ఇవే కాకుండా ఈ బ్యూటీకి తెలుగు, తమిళంలో మరిన్ని అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

చీరకట్టులో మంత్రముగ్దులను చేస్తోన్న మీనాక్షి.. అందాల తార అద్భుతమైన ఫోటోస్..