
వీటిలో మొదటిగా చెప్పుకోల్సిన సినిమా ఎపిక్ మిథిలాజికల్ మూవీ 'మాయ బజార్'. 1957లో కేవీ రెడ్డి తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమా విజువల్స్ ది బెస్ట్ అనిపించింది. అప్పటికి అస్సలు మన దగ్గర ఎలాంటి బెస్ట్ లేకపోయినా బెస్ట్ విజువల్ ఎఫెక్ట్లతో ప్రేక్షకలను మెప్పించింది ఈ సినిమా.

దీని తర్వాత ఆ రేంజ్ విజువల్స్తో టాలీవుడ్ స్టాండర్డ్స్ మార్చిన సోషియో ఫాంటసీ సినిమా 'జగదేక వీరుడు అతిలోక సుందరి'. 1990లో వచ్చిన ఈ సినిమాలో స్వర్గ లోకం, మానస సరోవర ప్రాంతాలు ఐ ఫీస్ట్ అనిపించాయి. అప్పటికి మన దగ్గరు అంత బెస్ట్ టెక్నాలజీ లేదు.

2004లో చిరు నటించిన మిథిలాజికల్ ఫాంటసీ థ్రిల్లర్ ‘అంజి’. ఈ మూవీ విజువల్ ఎఫెక్ట్స్కి సనత్కు జాతీయ చలనచిత్ర అవార్డును లబించింది. ఈ సినిమా టైంకి కొంత టెక్నాలజీ మాత్రమే ఉన్నప్పటికీ అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్లతో ఐ ఫీస్ట్ అనిపించారు మేకర్స్.

దీని తర్వాత దాదాపు 11 ఏళ్ల తర్వాత వచ్చి తెలుగు సినిమా ఖ్యాతికి వరల్డ్ వైడ్ పరిచయం చేసిన సినిమా బాహుబలి. ఈ మూవీస్ రెండు పార్టులు విజువల్ వండర్గా నిలిచాయి. బాహుబలి ఫస్ట్ పార్ట్ 750 కోట్లు, బాహుబలి సెకండ్ పార్ట్ 1810 కోట్లు వసూళ్లు చేశాయి. అంటే ఈ రెండు పార్టులు కలిపి 2500 కోట్లు కొల్లగొట్టాయి అన్నమాట.

గత ఏడాది ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఎపిక్ మిథిలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ 'కల్కి 2898 ఏడీ' విజువల్ ఎఫెక్ట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అనుకోండి. ఈ మూవీ క్రియేట్ చేసిన వండర్స్ ఇన్ని అన్ని కాదు. నార్త్ అమెరికా మొత్తం $18.57 మిలియన్లు వసూళ్లు చేసింది. ఇది సరిపోదా మన టాలీవుడ్ విజువల్స్తో హాలీవుడ్ కూడా ఫిదా అయింది అని చెప్పడానికి. ఈ సినిమా 1200 కోట్లకు పైగా వసూళ్లు చేసింది.