
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్

ఆ తర్వాత అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య నటించిన దోచేయ్ సినిమాలో హీరోయిన్గా చేసింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.

దాంతో ఈ భామ తిరిగి బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ వరుస సినిమాలతో ఫుల్ జోష్లో ఉంది ఈ పొడుగుకాళ్ల సుందరి

ఇక ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించనుంది.

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సీతగా కనిపించనుంది కృతి. ఇది పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది.

తాజాగా కృతిసనన్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది. రెడ్ డ్రెస్లో రెడ్ హాట్గా అమ్మడు ఫోటోలకు ఫోజులు ఇస్తూ వయ్యారాలు వొలకబోసింది.