
సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గ్లామర్ షోకు.. హడావిడికి దూరంగా ఉంటూ కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటుంది. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం హిందీలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ అక్కడే బిజీగా ఉంటుంది.

ప్రస్తుతం సాయి పల్లవి నటించిన ఓ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో దుమ్మురేపుతుంది. ఆ సినిమా దాదాపు 7 ఏళ్ల క్రితం విడుదలైంది. థియేటర్లలో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. ఓటీటీలో మాత్రం దూసుకుపోతుంది. ఇప్పుడు ఆకస్మాత్తుగా మరోసారి సోషల్ మీడియాలో ఆ మూవీ ట్రెండింగ్ అవుతుంది.

ఆ సినిమా పేరు అతిరన్. మలయాళంలో తెరకెక్కించిన ది బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో ఇది ఒకటి.. నటుడు ఫహద్ ఫాజిల్ హీరోగా నటించిన ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటించింది. ఈ చిత్రానికి డైరెక్టర్ వివేక్ దర్శకత్వం వహించగా.. 2019 ఏప్రిల్ 12న థియేటర్లలో విడుదలైంది

థియేటర్లలో ఈ చిత్రానికి ఊహించినంత రెస్పాన్స్ రాలేదు. మిశ్రమ స్పందన అందుకుంది. మలయాళంలో వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులోనూ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఓటీటీలో ఈ మూవీ ట్రెండ్ అవుతుంది. తెలుగులో అనుకోని అతిథి పేరుతో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఫాసిల్ ఫాజిల్, సాయి పల్లవితోపాటు ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్మి కీలకపాత్రలో నటించారు. ఈ సినిమాను హాలీవుడ్ లో వచ్చిన స్టోన్ హార్ట్స్ అసైలమ్ అనే సినిమా కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. దాదాపు 2 గంటల 16 నిమిషాల నిడివితో ఈ సినిమా సాగుతుంది.