
మహా నటి సినిమాతో జాతియ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ కీర్తి సురేష్.నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది.

మహానటి సినిమాతర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు దక్కించుకుంది ఈ చిన్నది.తక్కువ తెలుగులో టాప్ హీరోయిన్ లిస్ట్ లోకి చేరిపోయింది.

మొదట్లో బొద్దుగా ఉన్న ఈ బ్యూటీ ఇటీవల కాస్త బరువు తగ్గి నాజూకుగా తయారైంది. తెలుగు తమిళ్ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తుందికీర్తి.

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో హీరోయింగ్ గా నటిస్తుంది కీర్తి.


లాక్ డౌన్ సమయంలోను వరుసగా లేడి ఓరియంటెడ్ సినిమాలతో అలరించింది. ఓటీటీ వేదికగా పెంగ్విన్ , మిస్ ఇండియా సినిమాలు రిలీజ్ అయ్యాయి.