
ఇటు వచ్చారంటే... ఇటే వచ్చేసినట్టా? . అంటే అటు వెళ్లరా? అని డౌటనుమానాలున్నాయా? అయినా అంత దూరం ఆలోచించడం ఎందుకు? ఏదో ఇటొచ్చారంతే... అనుకుంటే పోతుందిగా... అయినా అటూ.. ఇటూ అంటూ మనం మాట్లాడుకోవడం ఎందుకు గానీ, జాన్వీనే అడిగేద్దాం పదండి.. ఇంతకీ కంప్లీట్గా ఇటు వచ్చేసినట్టో.. లేకుంటే, అటు కూడా వెళ్లే ఉద్దేశం ఉన్నట్టో..!

సెప్టెంబర్ స్టార్ట్ కాగానే నందమూరి అభిమానులు ఎంత ఉత్సాహంగా కనిపిస్తున్నారో, అంతకు డబుల్ జోష్లో ఉన్నారు శ్రీదేవి తనయ జాన్వీ. తనకు ఎంతో ఇష్టమైన తారక్తో కలిసి చేసిన సినిమా, ఈ నెల్లోనే విడుదల కానుంది. తన తల్లి ఒకప్పుడు ఏలిన ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నామనే ఉత్సాహం కనిపిస్తోంది ఈ బ్యూటీలో.

దేవర సక్సెస్ కోసం ఇష్టంగా ఎదురుచూస్తున్నారు జాన్వీ కపూర్. ఆమె యాక్ట్ చేసిన తంగం కేరక్టర్కి ఫస్ట్ పార్టుకన్నా, సెకండ్ పార్టులోనే యాక్టింగ్కి స్కోప్ ఎక్కువగా ఉంటుందట. అయినా ఇప్పటికే పాటలతో తారక్తో ఆన్స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పేశారు.

దేవర ప్రాజెక్టులతో పాటు సౌత్లో చెర్రీ - బుచ్చిబాబు సినిమా చేస్తున్నారు జాన్వీ కపూర్. మెగాస్టార్ కొడుకు, అతిలోక సుందరి కూతురు కాంబినేషన్లో వస్తున్న ఆ ప్రాజెక్ట్ మీద కూడా మంచి హోప్స్ ఉన్నాయి జనాలకు. త్వరలోనే ఆ షూటింగ్కీ జాయిన్ అవుతారు ఈ బ్యూటీ..

జాన్వీ సౌత్ ప్రాజెక్టులు చూసి, మరి నార్త్ సంగతేంటి? అనే మాటలు వినిపించాయి. అయితే ఆ డౌట్స్ అసలు వద్దంటున్నారు ఈ భామ. సిద్ధార్థ్ మల్హోత్రాతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అర్బన్ రొమాంటిక్ డ్రామాగా బోల్డ్ సబ్జెక్టుతో తెరకెక్కనుంది ఈ సినిమా. సో.. నార్త్ అండ్ సౌత్ని బ్యాలన్స్ చేయడానికి తాను రెడీ చేయడానికి అనే సిగ్నల్స్ గట్టిగానే పంపిస్తున్నారు శ్రీదేవి తనయ.