
ఇన్నేళ్లు ఒక లెక్క. 2024 ఇంకో లెక్క అని జబర్దస్త్ గా అంటున్నారు జాన్వీ కపూర్. ఆమె అంత కాన్ఫిడెంట్గా, అంత ఎగ్జయిటింగ్గా చెప్పడానికి రీజన్ ఉంది. ఇప్పటిదాకా జాన్వీ నటించిన మూడు సినిమాలు ఒకే ఏడాది ఎప్పుడూ విడుదల కాలేదు. 2024లో ఆ ఛాన్స్ రాబోతోంది జాన్వీ కపూర్కి.

ఆమె నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమా రిలీజ్ డేట్ని లాక్ చేశారు మేకర్స్. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సినిమా మిస్టర్ అండ్ మిసెస్ మహి. రాజ్కుమార్ రావుతో జాన్వీ కపూర్ కలిసి నటిస్తున్నారు. ''ఒక కలను వెతుకుతున్న రెండు హృదయాల కథ మిస్టర్ అండ్ మిసెస్ మహి. జస్ట్ పిక్చర్ పర్ఫెక్ట్. 2024 ఏప్రిల్ 19న థియేటర్లలో విడుదల చేయడానికి రెడీ అవుతున్నాం'' అంటూ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.

మిస్టర్ అండ్ మిసెస్ మహి స్పోర్ట్స్ డ్రామా. రూహీ సినిమా తర్వాత రాజ్కుమార్, జాన్వీ కలిసి నటిస్తున్న మూవీ ఇది. గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ సినిమాను తెరకెక్కించిన శరణ్ శర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ ఏడాది మేలోనే సినిమా షూటింగ్ పూర్తయింది. ''నేను బ్యాట్ పట్టుకుని ఇవాళ్టికి రెండేళ్లయింది'' అయింది అంటూ మిస్టర్ అండ్ మిసెస్ మహి షూటింగ్ పూర్తయిన సందర్భంగా సుదీర్ఘమైన పోస్టు పెట్టారు జాన్వీ కపూర్.

మరోవైపు సౌత్లో దేవర సినిమాలో నటిస్తున్నారు జాన్వీ కపూర్. దేవరలో తంగం కేరక్టర్లో ఆమె లుక్ రిలీజ్ అయినప్పటి నుంచి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. జూనియర్ ఎన్టీఆర్కి జాన్వీకపూర్ పెద్ద ఫ్యాన్. అభిమాన నటుడి చిత్రంతో సౌత్లో ఎంట్రీ ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నారు జాన్వీ కపూర్. వచ్చే ఏడాది వేసవి మీద ఖర్చీఫ్ వేసేశారు దేవర టీమ్. ఫస్ట్ పార్టు రిలీజ్ అయ్యేది అప్పుడేనని పదేపదే చెబుతున్నారు. ఇటీవల 150 డేస్ కౌంట్ డౌన్ బిగిన్స్ అంటూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. భయానికే భయం పుట్టించేంత భయంకరంగా ఉంటుందట దేవర. ఆ సినిమాలో తారక్ లవ్ ఇంట్రస్ట్గా జాన్వీ ఎలా మెప్పిస్తారో చూడాలి.

ఈ రెండు సినిమాలతో పాటు ఆమె నటించిన ఉల్జా సినిమా కూడా వచ్చే ఏడాది విడుదలకు రెడీ అవుతోంది. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా ఉల్జా. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మూడు సినిమాలు మూడు జోనర్లలో ఒకే ఏడాది విడుదల కావడం థ్రిల్లింగ్గా ఉందనిపిస్తోందని అంటున్నారు జాన్వీ కపూర్. ఈ ఏడాది ఆమె నటించిన బవాల్ విడుదలైంది. రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీలో ఓ పాటలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు ఈ బ్యూటీ.