ఒకప్పుడు పెద్ద సినిమా విడుదలవుతుందంటే అభిమానుల్లో ఉత్సాహం.. ఆడియన్స్లో చూడాలనే ఆసక్తి ఉండేది. కానీ ఇప్పుడు ఓ పెద్ద సినిమా వస్తుందంటే.. టికెట్ రేట్ గుర్తుకొచ్చి ప్రేక్షకుడికి గుండెదడ మొదలవుతుంది. ఓ పెద్ద హీరో సినిమా చూడాలంటే టికెట్కు కనీసం 400 నుంచి 500 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందిప్పుడు.
ట్రిపుల్ ఆర్ నుంచి ఈ టికెట్ రేట్ల ఇష్యూ టాలీవుడ్లో నడుస్తుంది. ఆ సినిమాకు తెలంగాణ మల్టీప్టెక్స్లలో 450 రూపాయల రేట్ పెట్టారు. ఆ తర్వాత కేజియఫ్ 2, ఆచార్య సహా చాలా సినిమాలకు ఇదే కంటిన్యూ అయింది. ఆ మధ్య గుంటూరు కారంకు ఇదే రేట్ ఉంది..
మొన్నటికి మొన్న కల్కి రేట్ సైతం భారీగానే ఉంది. అంతెందుకు భారతీయుడు 2కు తమిళం కంటే తెలుగులోనే ఎక్కువ టికెట్ రేట్ ఉంది.ఆల్రెడీ తెలంగాణలో 295 రూపాయల టికెట్ రేట్ ఉంది. దానిపై అదనంగా మరో 75 నుంచి 100 రూపాయలు పెంచుకుంటున్నారు నిర్మాతలు.
రేట్ పెంచుకోకపోతే సినిమాపై నమ్మకం లేదేమో అనే డౌట్ వస్తుందని.. ప్రస్టేజ్ ఇష్యూగా తీసుకుంటున్నారు నిర్మాతలు. ఇదే టైమ్లో కొందరు నిర్మాతలు సినిమా రేట్లు తగ్గిస్తున్నారు. మొన్న పేకమేడలు అనే చిన్న సినిమాను 50 రూపాయలకు చూపించారు నిర్మాతలు.
అల్లు శిరీష్ కొత్త సినిమా బడ్డీ టికెట్ రేట్ మల్టీప్లెక్స్లలో 125, సింగిల్ స్క్రీన్స్లో 75 రూపాయలుగా ఫిక్స్ చేసారు. ఇంకొన్ని సినిమాలు 200 టికెట్ రేట్తోనే వస్తున్నాయి. ఇదే పెద్ద సినిమాలకు కూడా కంటిన్యూ అయితే రిపీట్ ఆడియన్స్ కూడా ఉంటారు. ఈ చిన్న లాజిక్ నిర్మాతలు ఎందుకు అర్థం చేసుకోవట్లేదో అనే కామెంట్స్ గట్టిగానే వినిపిస్తున్నాయిప్పుడు.