
రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ ఆర్ఆర్ సినిమాను తెరకెక్కించి సంచలనం సృష్టించారు. వీరిద్దరు తమ నటనతో ఎంతో మందిని ఆకట్టుకున్నారు. అయితే వీరి కాంబోలో త్రిబుల్ ఆర్ కంటే ముందే ఒక సినిమా రావాల్సి ఉండేనంట. కానీ మిస్సైందంట. ఇంతకీ ఆ సినిమా ఏది అంటే?

రామ్ చరణ్, తారక్ త్రిబుల్ ఆర్ కంటే ముందు చెర్రీ, అల్లు అర్జున్ నటించిన ఎవడు సినిమాలో కలిసి నటించాల్సి ఉండేదంట. ఈ మూవీ రిలీజై యావరేజ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.

ఎవడు మూవీలో కాజల్, శ్రుతిహాసన్ హీరోయిన్స్ గా నటించగా, అల్లు అర్జున్ కీలక పాత్రలో నటించగా, రామ్ చరణ్ హీరోగా నటించారు. అయితే ఈ సినిమాలో బన్నీ రోల్ కోసం దర్శకుడు వంశీ పైడిపల్లి జూయిర్ ఎన్టీఆర్ ను సంప్రదించాడంట.

కానీ తారక్ అప్పటికీ చాలా సినిమాలతో బిజీగా ఉండటం వలన ఈ సినిమాను రిజక్ట్ చేశాడంట. దీంతో ఈ మూవీలోకి అల్లు అర్జున్ వచ్చారు. అలా చెర్రీ, తారక్ కాంబోలో రావాల్సిన ఎవడు మూవీ మిస్సైందంట.

ఇక ఎవడు మూవీ రిలీజై యావరేజ్ టాక్ అందుకున్న విషయం తెలిసిందే. తర్వాత త్రిబుల్ ఆర్ సినిమాతో చెర్రీ , తారక్ వెండితెరపై సందడి చేసి సక్సెస్ అయ్యారు.