ప్లాన్ A వర్కవుట్ కానపుడు కచ్చితంగా ప్లాన్ B ఉండాల్సిందే. ఇప్పుడు ఇదే అప్లై చేస్తున్నారు శ్రీలీల. ఇన్నాళ్ళూ తెలుగులో సత్తా చూపించిన ఈ బ్యూటీ.. ఇకపై తెలుగుతో పాటు అన్ని ఇండస్ట్రీపై ఫోకస్ చేయాలనే నిర్ణయానికి వచ్చేసారు. ఈ క్రమంలోనే అమ్మడి చూపు ముంబైపై పడింది.
మరి శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఎలా ఉండబోతుంది..? టాలీవుడ్ బ్యూటీస్ ఇక్కడెంత మెరిసినా.. చివరికి వాళ్లు చేరాల్సిన గమ్యం మాత్రం బాలీవుడ్డే. రష్మిక మందన్న, సాయి పల్లవి, సమంత.. ఇలా చాలా మంది హీరోయిన్లు బాలీవుడ్ వైపు వెళ్తున్నారు.
ఇదే దారిలో తాజాగా శ్రీలీల కూడా చేరిపోయారు. ఈమె సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీ అలీ ఖాన్ పరిచయం అవుతున్న సినిమాలో హీరోయిన్గా ఎంపికైనట్లు ప్రచారం జరుగుతుంది.
జూలైలో ప్రారంభం కానున్న ఈ సినిమాను అక్టోబర్లోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో త్వరలోనే శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ ఉండబోతుందన్న న్యూస్ ట్రెండ్ అవుతోంది.
ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఆలస్యమయ్యేలా ఉంది. ఈ కారణంతోనే బాలీవుడ్పై ఫోకస్ చేసారు శ్రీలీల. ఈ క్రమంలోనే ఇబ్రహీం సినిమాతో శ్రీలీల ముంబై ట్రైన్ ఎక్కబోతున్నారు.
కునాల్ దేశ్ముఖ్ తెరకెక్కించబోయే ఈ చిత్ర షూటింగ్ ఆగస్ట్ నుంచి మొదలు కానుందని తెలుస్తుంది. నేడో రేపో అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడం ఖాయమైపోయింది.
ఆ ప్రాజెక్ట్తో పాటు తెలుగులోనూ వరస సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు శ్రీలీల. మొత్తానికి ఈ బ్యూటీ కూడా రెండు పడవల ప్రయాణం చేయాలని ఫిక్సైపోయారన్నమాట.