
యంగ్ హీరో రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ముద్దుగుమ్మ కీర్తిసురేష్. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.

ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన నేను మహానటి సినిమాతో సంచనలన విజయాన్ని అందుకుంది కీర్తిసురేష్. మహానటి సావిత్రి జీవితకథతో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అచ్చం సావిత్రిగారిలా అద్భుతంగా నటించి మెప్పించింది ఈ అమ్మడు. ఇక ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయిపోయింది. ఆ తర్వాత తెలుగులో ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.

ఇక కీర్తిసురేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. తన సినిమా న్యూస్ తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ఈ భామ.

తాజాగా తన పూర్వీకుల ఇంటి గురించి వివరించింది కీర్తిసురేష్. కీర్తి సురేష్ తన ఫ్యామిలీతో కలిసి తమిళనాడులోని తమ పూర్వీకుల ఇంటికి వెళ్లింది..

ఆ విషయాలను అక్కడి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఎంత స్టార్ గా ఎదిగిన తన మూలాలు మర్చిపోలేదు కీర్తిసురేష్.

దాంతో ఈ అమ్మడి పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. ఇల్లంతా కలియతిరుగుతూ.. అక్కడ కాసేపు సేదతీరింది.

ఇప్పుడు ఏ ఫొటోలు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈవీడియో పై మీరూ ఓ లుక్కెయండి.

కీర్తి సురేష్ పూర్వీకుల ఇల్లు , దేవాలయం కు సంబంధించిన ఫొటోస్.