సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్స్ ఫోటోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ హీరోయిన్ కు సంబందించిన ఫోటోలు, వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ హీరోయిన్ కు సంబందించిన పిక్ వైరల్ గా మారింది.
పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె రీసెంట్ గా చాలా పాపులర్ అయ్యింది. ఇప్పుడు ఎక్కడ చూసిన ఆమె పేరే వినిపిస్తుంది. ఇంతకు ఆమె ఎవరో కనిపెట్టరా.? అప్పటికీ ఇప్పటికీ ఆమె చాలా మారిపోయింది. ఆమె ఎవరంటే..
పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు హాట్ బ్యూటీ శోభిత దూళిపాళ్ల. అడవి శేష్ హీరోగా నటించిన గూఢచారి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆతర్వాత మేజర్ మూవీలో నటించింది శోభిత దూళిపాళ్ల. అలాగే హాలీవుడ్ మూవీలోనూ నటించింది.
శోభిత దూళిపాళ్ల 2013 మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానం సొంతం చేసుకుంది. 2013లో జరిగిన మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీల్లో భారతదేశం తరపున పాల్గొంది. ఈ అమ్మడు తెనాలిలో జన్మించింది.
తాజాగా అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్యను ఎంగేజ్ మెంట్ చేసుకుంది. త్వరలోనే వీరి వివాహం జరగనుంది. శోభిత దూళిపాళ్ల చైతన్యను వివాహం చేసుకోనుంది. ఈ ఇద్దరూ 2022 నుంచి ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది.