
ఇవాళ్రేపు చెప్పిన టైమ్కి సినిమాను రిలీజ్ చేయడం మామూలు విషయం కాదు. పక్కా డేట్కి రిలీజ్ అయ్యే సినిమాలకన్నా, పోస్ట్ పోన్ అయ్యే ప్రాజెక్టుల గురించే ఎక్కువగా వింటున్నాం. ఆ కథలు వేరు, మా కమిట్మెంట్ వేరు అని అంటోంది పుష్ప టీమ్.

తగ్గేదేలే అనేది పుష్పరాజ్ మేనరిజమ్ అయితే, అసలు తగ్గేదేలే అనే మాటను అదే పనిగా ప్రాక్టీస్ చేస్తోంది పుష్ప2 టీమ్. అంతే కాదు, ఆ మాటను నిలబెట్టుకోవాలని రాత్రింబవళ్లు శ్రమిస్తోంది యూనిట్.

ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు పుష్ప మేకర్స్. అల్లు అర్జున్, రష్మికతో పాటు కీలక పాత్రధారులందరూ ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. ఆగస్టు 15న రిలీజ్కి రెడీ అవుతోంది పుష్ప సీక్వెల్.

ప్యాన్ ఇండియా రేంజ్లో పుష్ప మూవీకి ఎంత మంచి అప్లాజ్ వచ్చిందో స్పెషల్గా మెన్షన్ చేయక్కర్లేదు. ఈ సారి అంతకు మించి అనేలా, వెయ్యి కోట్లకు మించిన బాక్సాఫీస్ కలెక్షన్లను ఎయిమ్ చేస్తున్నారు కెప్టెన్ సుకుమార్.

సింహాన్ని ఆనుకుని సుకుమార్ నిలుచున్న పిక్ని రష్మిక మందన్న సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇన్స్టాంట్గా వైరల్ అయింది పిక్. ఆ పిక్తో పాటు, ప్రొడ్యూసర్స్ పెట్టిన పోస్ట్ కూడా స్పీడ్గా స్ప్రెడ్ అవుతోంది.

రిలీజ్ డేట్ని మరోసారి కన్ఫర్మ్ చేస్తూ పోస్ట్ పెట్టారు మేకర్స్. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ మీద ఎక్కువ కాన్సెన్ట్రేట్ చేయాలని భావిస్తున్నారట సుకుమార్.

అందుకు తగ్గట్టుగానే టీమ్ని కూడా ప్రిపేర్ చేస్తున్నారని టాక్. పుష్పతో పోలిస్తే, పుష్ప 2 ఆడియో, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోతుందన్నది దేవిశ్రీ ప్రసాద్ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట.