
ఇన్నాళ్లూ మేం మీకిచ్చాం కదా.. ఇప్పుడిక మీరు మాకివ్వండి.. బాకీ తీర్చుకునే సమయం వచ్చేసింది.. తీర్చుకోండి అంటున్నారు బాలీవుడ్ హీరోలు. సౌత్ సినిమాలు నార్త్లో వందల కోట్లు వసూలు చేయడంతో.. వాళ్లకు కూడా మన మార్కెట్పై గట్టిగా కన్నుపడింది.

సల్మాన్, షారుక్ అంటే ఓకే.. కానీ అందరూ టాలీవుడ్పై ఫోకస్ చేస్తున్నారు. తాజాగా మరో హీరో దండయాత్రకు వచ్చేసారు. బాలీవుడ్ హీరోలు సౌత్ మార్కెట్పై చాలా ఫోకస్ చేసారు. స్టార్ హీరోలంటే ఏమో అనుకోవచ్చు కానీ అక్కడున్న హీరోలంతా సౌత్ మార్కెట్.. అందులోనూ మరీ ముఖ్యంగా తెలుగు మార్కెట్ కావాలంటున్నారు.

కావాలంటే చూడండి ఇప్పుడు టైగర్ ష్రాఫ్ సైతం తన సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈయన నటిస్తున్న గణపత్ తెలుగు టీజర్ను చిరంజీవి విడుదల చేసారు. వికాస్ భెల్ తెరకెక్కిస్తున్న గణపత్పై బాలీవుడ్పై అంచనాలు భారీగా ఉన్నాయి. అక్టోబర్ 20న విడుదల కానుంది ఈ చిత్రం.

ఇందులో అమితాబ్ బచ్చన్, జాతీయ ఉత్తమ నటి కృతిసనన్ నటిస్తున్నారు. 50 ఏళ్ళ తర్వాతి కథతో అంటే.. 2070 నేపథ్యంలో సాగే కథ ఇది. అదిరిపోయే విజువల్స్కు తోడు టైగర్ ష్రాఫ్ మార్షల్ ఆర్ట్స్ గణపత్కు కలిసొచ్చే అంశం.

గణపత్ మాత్రమే కాదు.. సల్మాన్ ఖాన్ టైగర్ 3తో దివాళికి వచ్చేస్తున్నారు. ఆ పండక్కి మన సినిమాలేవీ రావట్లేదు అందుకే కండల వీరుడు టేకోవర్ చేస్తున్నారు.

మరోవైపు వార్ 2లో హృతిక్ రోషన్తో పాటు ఎన్టీఆర్ నటిస్తున్నారు కాబట్టి దానిపై అంచనాలు ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు. ఇక రణ్బీర్ కపూర్ యానిమల్పై అంచనాలు మామూలుగా లేవు. మొత్తానికి సౌత్పై నార్త్ వాళ్ల ఫోకస్ పెరిగిపోయిందిప్పుడు.