
బాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ యష్ రాజ్ ఫిలింస్ కొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. వెండితెర మీద విజువల్ స్పెక్టకిల్స్ను ఆవిష్కరిస్తున్న ఈ ప్రొడక్షన్ హౌస్, ఆ సినిమాల కోసం టాప్ స్టార్స్ను విలన్స్గా మార్చేస్తోంది.

ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమాలతో పాటు అప్ కమింగ్ సినిమాల విషయంలోనే ఇదే ఫార్ములాను కంటిన్యూ చేస్తోంది వైఆర్ఎఫ్. ధూమ్ సిరీస్తో పాటు స్పై యూనివర్స్ లాంటి బిగ్ యాక్షన్ డ్రామాలను రూపొందిస్తున్న యష్ రాజ్ ఫిలింస్ సంస్థ ఆ సినిమాలతో స్టార్ హీరోలను కూడా విలన్స్గా మార్చేస్తోంది.

ధూమ్ సిరీస్తోనే ఈ ట్రెండ్ను మొదలు పెట్టిన వైఆర్ఎఫ్, స్పై యూనివర్స్లోనూ అదే ట్రెండ్ను కంటిన్యూ చేస్తోంది. ధూమ్ 1లో అభిషేక్ బచ్చన్ పోలీస్ క్యారెక్టర్లో హీరోగా కనిపిస్తే, జాన్ అబ్రహం దొంగ పాత్రలో నటించారు.

అయితే ఆ సినిమాలో హీరో కన్నా విలన్ రోల్కే మంచి రెస్పాన్స్ రావటంతో ధూమ్ 2లో టాప్ హీరో హృతిక్ రోషన్ నెగెటివ్ రోల్లో కనిపించి షాక్ ఇచ్చారు.

ఆ తరువాత ధూమ్ 3లో ఆమిర్ లాంటి బిగ్ స్టార్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించటం ఇండస్ట్రీ సర్కిల్స్లో హాట్ టాపిక్ అయ్యింది.

ఏక్థా టైగర్ సినిమాతో స్పై యూనివర్స్ను స్టార్ట్ చేసిన వైఆర్ఎఫ్ రీసెంట్ టైమ్స్లో ఆ జానర్లో బిగ్ బడ్జెట్ మూవీస్ను ప్లాన్ చేస్తోంది. తాజాగా పఠాన్ సినిమా కోసం హీరోగా బిజీగా ఉన్న జాన్ అబ్రహంను విలన్గా మార్చేసింది యష్ రాజ్ ఫిలింస్.

ఆ మధ్య వార్ సినిమాలోనూ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ను నెగెటివ్ రోల్లో నటించారు. ఇప్పుడు రిలీజ్కు రెడీ అవుతున్న టైగర్ 3లోనూ హీరోగా మంచి సినిమాలు చేస్తున్న ఇమ్రాన్ హష్మీ పాక్ తీవ్రవాదిగా నటించారు. ఇలా స్టార్ హీరోలను విలన్స్గా చూపిస్తూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది వైఆర్ఎఫ్.