
దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు భక్తులు. ఇక ముంబైలోనూ ఎప్పట్లాగే భారీగా సెలబ్రేట్ చేసుకున్నారు.. ఈ వేడుకల్లో భాగమయ్యారు జాన్వీ కపూర్.

పాపం ఉట్టి కొట్టడానికి వెళ్లి ఉత్తి పుణ్యానికే ఈ బ్యూటీ ట్రోల్ అవుతున్నారిప్పుడు. అక్కడ ఆమె చేసిన భారత్ మాతా కీ జై అనే నినాదమే ఈ మొత్తం వ్యవహారానికి కారణం. ‘భారత్ మాతాకీ జై’ అంటూ ఉట్టి కొట్టడంతో జాన్వీని ట్రోల్స్ చేస్తున్నారు.

మేడమ్ మీరు వచ్చింది కృష్ణాష్టమి వేడుకలకు.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకకు కాదు.. అది వేరు.. ఇది వేరూ అంటూ జాన్వీపై కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై జాన్వీ కపూర్ కూడా క్లారిటీ ఇచ్చారు.

ఈ వేడుకలో పాల్గొన్న చాలా మంది ఉట్టి కొట్టడానికి ముందు ‘భారత్ మాతాకీ జై’ అన్నారని.. వాళ్లతో పాటే తాను అన్నానన్నారు జాన్వీ.అక్కడ మిగిలిన వాళ్లన్న మాటలను కట్ చేసి.. కేవలం తన మాటలనే హైలైట్ చేస్తున్నారని తెలిపింది జాన్వీ.

అయినా దేశాన్ని పొగడడానికి ప్రత్యేకంగా ఒక రోజంటూ అవసరం లేదు.. జన్మాష్టమైనా ఎప్పుడైనా ‘భారత్ మాతాకీ జై’ అంటాను అంటూ రిప్లై ఇచ్చారు జాన్వీ. మొత్తానికి కృష్ణాష్టమి వేడుకలేమో గానీ.. అతిథిగా వచ్చి ట్రోల్ అయ్యారు ఈ భామ.